Agripedia

దేశంలో మొదటిసారి అగ్రివోల్టాయిక్స్ రాక!! అసలు ఏంటిది?

Sandilya Sharma
Sandilya Sharma
Image Courtesy: Pexels
Image Courtesy: Pexels

దేశంలో తొలిసారిగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అగ్రివోల్టాయిక్స్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. ఈ వినూత్న విధానంలో వ్యవసాయ భూమిలోనే సౌరశక్తిని ఉత్పత్తి చేసి, రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించనున్నారు.

అగ్రివోల్టాయిక్స్ అంటే ఏమిటి?

  • అగ్రివోల్టాయిక్స్ అనేది సౌరప్యానెల్స్‌ను పంట పొలాలలో ఎత్తుగా అమర్చి, విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు పంటల పెరుగుదలను ప్రోత్సహించే మోడల్.
  • సౌరప్యానెల్స్ పంటలకు తగినంత నీడను కల్పించి, అధిక వేడి ప్రభావాన్ని తగ్గిస్తాయి.

  • ఈ విధానం వల్ల నీరు ఆవిరి అవ్వడం తగ్గి, నీటి వినియోగం కూడా క్రమంగా తగ్గుతుంది.

రైతులకు కలిగే ప్రయోజనాలు

రైతులు పంట సాగుచేస్తూనే సౌరశక్తి ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలరు.

ఈ విధానం వల్ల వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

 

ప్రాంతాలలో విద్యుత్ సమస్య ఉన్న రైతులకు ఇది సుస్థిరమైన ప్రత్యామ్నాయంగా మారుతుంది.

ఉత్తరప్రదేశ్ ముందడుగు

దేశంలో మొదటిసారి ఈ ప్రాజెక్ట్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (DEA) ఈ ప్రాజెక్ట్‌కు సాంకేతిక సహాయం మంజూరు చేసింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో భూసముపాయాన్ని సమర్థంగా ఉపయోగించుకోవచ్చు.

ప్రభుత్వ మద్దతు & పెట్టుబడులు

  • ఒక మెగావాట్ అగ్రివోల్టాయిక్స్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు సుమారు రూ. 50 కోట్లు ఖర్చు అవుతుంది.

  • ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్తాన్ మహాభియాన్ (PM-KUSUM) కింద 30% వరకు నిధులు ప్రభుత్వం అందిస్తోంది.

  • మిగిలిన 70% నిధులను బ్యాంకు రుణాల ద్వారా పొందే వీలుంది.

వనరుల సమర్థ వినియోగానికి కొత్త మార్గం

ఈ కొత్త వ్యవస్థతో వ్యవసాయ భూమిని అత్యుత్తమంగా వినియోగించుకోవచ్చు. పంటల పెరుగుదల, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూలత, అదనపు ఆదాయం వంటి అనేక ప్రయోజనాలతో అగ్రివోల్టాయిక్స్ వ్యవసాయ రంగంలో కొత్త దిశను సూచించనుంది.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More