News

ఇదే దేశ ఎరువుల బడ్జెట్.. దేనికి ఎన్ని కోట్లు?

Sandilya Sharma
Sandilya Sharma
Image Courtesy: Pexels
Image Courtesy: Pexels

దేశంలో ఎరువుల సరఫరాను నిరంతరంగా కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2024-25 బడ్జెట్ అంచనాలో రూ. 1,68,130.81 కోట్లుగా నిర్ణయించిన నిధులు,   ఇప్పుడు పూర్తిగా  1,91,836.29 కోట్లకు పెంచింది.

ఎన్‌బీఎస్ పథకానికి పెరుగుతున్న నిధులు

పోషక ఆధారిత సబ్సిడీ (NBS) పథకానికి రూ. 45,000 కోట్లుగా కేటాయించిన నిధులను, అంతిమంగా రూ. 54,310 కోట్లకు పెంచారు.

దీనివల్ల రైతులకు ఫాస్పేటిక్ & పొటాషిక్ ఎరువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి.

DAP ధర నియంత్రణ & ప్రత్యేక ప్యాకేజీ

DAP ఎరువుల ధరలను నియంత్రించి, రైతులకు తక్కువ ఖర్చుతో అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.


జియో-పొలిటికల్ సమస్యల కారణంగా DAP దిగుమతులు ప్రభావితం కావడంతో, ప్రత్యేక ప్యాకేజీ ద్వారా అదనంగా రూ. 3,500/టన్ను సబ్సిడీ అందించనుంది.

యూరియా సబ్సిడీ కొనసాగింపు

  • యూరియాను రైతులకు ఎమ్మార్పీ ధర  ప్రకారం రూ. 242/ 45 కేజీ బస్తాకు అందిస్తున్నారు.
  • 2018 నుండి ఇప్పటి వరకు యూరియా ధరలో ఎలాంటి మార్పు లేదు.

ఎరువుల సరఫరా పర్యవేక్షణకు iFMS

  • దేశవ్యాప్తంగా ఎరువుల సరఫరాను పర్యవేక్షించేందుకు "ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ సిస్టమ్ (iFMS)" ద్వారా ఆధునిక నిఘా ఏర్పాటు.
  • రాష్ట్రాల అవసరాలను నెలవారీగా అంచనా వేసి, సరఫరా ప్రణాళిక రూపొందించడం జరుగుతోంది.

కేంద్రం తీసుకుంటున్న తాజా చర్యలతో ఎరువుల లభ్యత పెరిగి, రైతులకు పెద్ద ఊరటగా మారనుంది. బడ్జెట్ పెంపుతో వ్యవసాయ ఉత్పాదకతకు మరింత బలమైన మద్దతు లభించనుంది.

Share your comments

Subscribe Magazine