News

Annadatha Sukheebhava Update: ఆరోజు నుండి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం, సీఎం చంద్రబాబు రైతులకు శుభవార్త

Sandilya Sharma
Sandilya Sharma
రైతులకు సీఎం చంద్రబాబు తీపి వార్త! జూన్ 12న ‘అన్నదాత సుఖీభవ’ పథకం శుభారంభం
రైతులకు సీఎం చంద్రబాబు తీపి వార్త! జూన్ 12న ‘అన్నదాత సుఖీభవ’ పథకం శుభారంభం

ఆంధ్రప్రదేశ్ రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం జూన్ 12న ప్రారంభం కానుంది. మునుపటి ప్రకటనలో ఈ పథకాన్ని మే నెలలో ప్రారంభిస్తామన్నా, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ షెడ్యూల్‌తో సాంకేతికంగా అనుసంధానం చేయడంతో తేదీని జూన్ 12కు మార్చారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు.

ఎందుకు తేదీ మార్పు?

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది రూ.6000 పెట్టుబడి సాయం రైతులకు మూడు విడతలుగా అందించబడుతుంది — జూన్, అక్టోబర్, ఫిబ్రవరి నెలల్లో. ఇప్పటికే 19 విడతలు పూర్తయ్యాయి. ఇప్పుడు 20వ విడత విడుదలకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇదే సందర్భాన్ని అనుసరించి, ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని జూన్ 12న ప్రారంభించాలని నిర్ణయించింది.

ప్రారంభ విడతలో ఎంత డబ్బు?

ఏపీ ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి అర్హుడైన రైతుకు ఏడాదికి రూ.20,000 ఇవ్వనున్నట్లు మేనిఫెస్టోలో తెలిపింది. ఇందులో రూ.6,000 కేంద్రం పీఎం కిసాన్ కింద ఇస్తే, మిగిలిన రూ.14,000ను రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. అయితే, మొత్తం డబ్బును ఒకేసారి కాకుండా మూడ్ విడతల్లో ఇవ్వాలని యోచనలో ఉంది. దీంతో జూన్ 12న రూ.5,000 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుండగా, కేంద్రం నుంచి వచ్చే రూ.2,000తో కలిపి రైతుల ఖాతాల్లో మొత్తం రూ.7,000 జమయ్యే అవకాశముంది.

అర్హులెవరు?

ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి గైడ్‌లైన్స్ తయారీ దశలో ఉన్నాయి. అయితే అధికారిక సమాచారం ప్రకారం, పీఎం కిసాన్‌ డబ్బు పొందుతున్న అంతిమ లబ్దిదారులలో నిఖార్సైన రైతులను మాత్రమే ఈ పథకంలోకి తీసుకునే అవకాశం ఉంది. అనర్హులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రక్షాళన ప్రక్రియ ప్రారంభించింది. ఇందులో పన్నులు చెల్లించే వారు, భూమి ఉన్నా సాగు చేయని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు వంటి వారు తొలగించబడతారు.

రైతులకు సూచనలు:

  • తమ పేరు అర్హుల జాబితాలో ఉండేలా అవసరమైన పత్రాలను రెడీగా ఉంచుకోవాలి — పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్, పాన్, రేషన్ కార్డు.

 

  • వ్యవసాయ అధికారులను సంప్రదించి వివరాలు స్పష్టత చేసుకోవాలి.

 

  • జూన్ 12 నాటికి ఖాతాలో డబ్బు రాకపోతే సంబంధిత బ్యాంకులను లేదా కలెక్టరేట్‌ను సంప్రదించాలి.

వానాకాలానికి ముందు ఆర్థిక సాయం

రాష్ట్రంలో నైరుతీ రుతుపవనాలు జూన్ 10 తర్వాత ప్రవేశించనున్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్‌కు ముందు రైతులకు ఆర్థికంగా సాయం చేయాలని ప్రభుత్వం ఈ తేదీని ఎంచుకుంది. వాతావరణశాఖ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం సాధారణం కంటే అధిక వర్షపాతం ఉండే అవకాశం ఉంది. రైతులు తమ సాగు కార్యక్రమాలను దీనిని బట్టి ప్రణాళిక చేసుకోవాలి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం ద్వారా వాస్తవంగా వ్యవసాయం చేసే చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక భరోసా అందించాలన్నదే లక్ష్యం. జూన్ 12 నాటికి మొదటి విడత సాయం జమ చేయనున్న ఈ పథకం, రాష్ట్ర రైతుల భవిష్యత్తును వెలుగుపరిచే దిశగా వేయబడుతున్న మరో ముందడుగు అని చెప్పవచ్చు.

Read More:

వరి‌కు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు – 30 ఏళ్ల వరకూ దిగుబడితో కొత్త ఆర్థిక భరోసా

PJTSAU మరియు WSUల భాగస్వామ్యం: తెలంగాణలోనే ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ డిగ్రీ కోర్సు ప్రారంభం

Share your comments

Subscribe Magazine

More on News

More