News

దొండకాయ ధర కుప్పకూలింది: రైతులకు తీవ్ర నష్టాలు, వ్యాపారుల దోపిడీపై ఆగ్రహం

Sandilya Sharma
Sandilya Sharma
Crop losses in Andhra and Telangana, Farmers' middlemen issues (Image Courtesy: X)
Crop losses in Andhra and Telangana, Farmers' middlemen issues (Image Courtesy: X)

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఇటీవలే టమాటా ధర భారీగా పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు అదే బాటలో దొండకాయల ధర కూడా కుప్పకూలింది. ఇదివరకు 10 కిలోల దొండకాయ ధర రూ.300-325 పలికినప్పటికీ, ప్రస్తుతం కేవలం రూ.150-50కి పరిమితమైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దొండకాయ సాగులో నష్టాలే నష్టాలు (Dondakaya price crash 2025)

సగటున ఒక ఎకరాలో దొండకాయ పంట సాగు చేయాలంటే రూ.2 లక్షల వరకు ఖర్చవుతుంది. కానీ మార్కెట్‌లో రైతులకు కిలోకు కేవలం రూ.5 మాత్రమే లభిస్తోంది. దీంతో పెట్టుబడి కూడా తిరగలేదని, సాగుకు పెట్టిన దారిలో దిగుబడిని గిట్టుబాటు ధరల్లో అమ్మలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఆసక్తికరంగా బహిరంగ మార్కెట్లలో మాత్రం దొండకాయ ధర రూ.20-30 వరకు పలుకుతుండటం విశేషం. దీనిపై రైతులు వ్యాపారుల దోపిడీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టమాటా ధరల పతనం – ఆందోళనలో రైతులు (Tomato price crash 2025)

ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా టమాటా రైతులకు గట్టిన బలవంతంగా మారింది. గత వారం రోజుల్లో క్వింటాకు గరిష్ఠ ధర రూ.1,480గా నమోదవుతుండగా, కనీస ధర రూ.800కి పడిపోయింది. ముందు వారం రూ.2,300 పలికిన టమాటా ఇప్పుడు కిలోకు రూ.10-20కే అమ్మకానికి వస్తోంది. అధిక ఉత్పత్తి, నాణ్యత లోపం, డిమాండ్ తగ్గుదల వంటివే ధర పతనానికి ప్రధాన కారణాలుగా వ్యాపారులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ చర్యలు,  కూరగాయల మార్కెట్ పతనం (Vegetable market crisis Telangana)


రైతుల ఆందోళనలతో మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలపై మార్కెటింగ్ శాఖ అధికారులు తక్కువ మొత్తంలో అయినా టమాటాను రైతుల నుంచి కొనుగోలు చేసి రైతు బజార్లలో తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అయితే రైతులు దీనిని తగిన పరిష్కారంగా భావించడం లేదు. ధరల కుదింపుతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, కనీస మద్దతు ధరగా టమాటాకు రూ.1,500 ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Agriculture market exploitation, Vegetable price fluctuation news (Image Courtesy: Google Ai)
Agriculture market exploitation, Vegetable price fluctuation news (Image Courtesy: Google Ai)

రైతుల భవితవ్యంపై ప్రశ్నార్థక చిహ్నం (Farmer loss vegetable cultivation)

 సగటు రైతు తీవ్ర పెట్టుబడులతో పంట సాగు చేస్తూ, మార్కెట్‌లో ధరలు పడిపోతే భారంగా పడుతున్న నష్టాన్ని భరించలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. ప్రభుత్వంతోపాటు మార్కెట్‌ వ్యవస్థలో సమగ్ర పునఃపరిశీలన జరగాల్సిన అవసరం ఉందని రైతులు చెబుతున్నారు. కూరగాయల ధరల్లో స్థిరత కోసం ప్రత్యేక విధానాలు, సమర్థవంతమైన కనీస మద్దతు ధర విధానం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read More:

కడప జిల్లాలో గొర్రెలు, మేకల్లో ప్రబలుతున్న వ్యాధులు: రైతుల్లో ఆందోళన

నిమ్మగడ్డి సాగుతో రైతులకు లక్షల లాభం: తక్కువ పెట్టుబడిలో అధిక ఆదాయం

Share your comments

Subscribe Magazine

More on News

More