News

ఎరువులపై భారీ రాయితీ! ఎన్ని కోట్ల బడ్జెట్?

Sandilya Sharma
Sandilya Sharma

దేశవ్యాప్తంగా రైతులకు పెద్ద ఊరటగా కేంద్ర ప్రభుత్వం 2025 ఖరీఫ్ సీజన్‌లో ఫాస్ఫరస్, పొటాష్ (పీ అండ్ కే), ఎరువులకు పోషక ఆధారిత సబ్సిడీ NBS రేట్లను అందించేందుకు 37,216.15 కోట్ల బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో పీ అండ్ కే ఎరువులు రైతులకు చౌక ధరల్లో అందుబాటులోకి రానున్నాయి.

రైతులకు భారీ ప్రయోజనం

  • రైతులు సబ్సిడీతో తక్కువ ధరలకు ఎరువులు పొందే అవకాశం.
  • మన్ను ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఈ ఎరువులు పంట దిగుబడిని పెంచుతాయి.

  • దేశవ్యాప్తంగా ఆహార భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

₹37,216.15 కోట్ల బడ్జెట్ – గతేడాది కంటే ₹13,000 కోట్లు అధికం

2025 ఖరీఫ్ సీజన్ కోసం కేటాయించిన ₹37,216.15 కోట్ల బడ్జెట్ గత రబీ సీజన్ కంటే ₹13,000 కోట్ల మేర ఎక్కువ. అంతర్జాతీయ ఎరువుల ధరల్లో జరిగిన మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.

ఎరువులపై సబ్సిడీ విధానం

  • 2025 ఏప్రిల్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు ఫాస్ఫరస్, పొటాష్ ఎరువులకు సబ్సిడీ వర్తింపు.

  • ఎన్పీకేఎస్ గ్రేడ్లు సహా అన్ని పీ అండ్ కే ఎరువులకు రాయితీ కొనసాగింపు.

సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ (SSP) రవాణా ఖర్చుల సబ్సిడీ కూడా పొడిగింపు.

రైతుల కోసం కేంద్రం కట్టుబాటు

ఈ సబ్సిడీ అమలు ద్వారా రైతులు చౌక ధరల్లో ఎరువులను పొందగలిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రైతులు ఈ పథకాలను వాడుకొని తమ వ్యవసాయాన్ని అబివృద్ధి చేసుకోవాలి.

Share your comments

Subscribe Magazine