News

ఇజ్రాయిల్‌తో వ్యవసాయ ఒప్పందం – భారత రైతులకు లాభమా? నష్టమా?

Sandilya Sharma
Sandilya Sharma
Indo-Israel agri innovation- India Israel agriculture agreement 2025 (Image Courtesy: PIB)
Indo-Israel agri innovation- India Israel agriculture agreement 2025 (Image Courtesy: PIB)

భారత్–ఇజ్రాయిల్ మధ్య వ్యవసాయ రంగంలో సహకారం మరింత బలపడుతోంది. కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇజ్రాయిల్ వ్యవసాయ, ఆహార భద్రతా శాఖ మంత్రి అవి డిక్టర్‌ల మధ్య మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కీలక ఒప్పందాలు కుదిరాయి (India Israel agriculture agreement 2025). ఉద్యాన, మృత్తికా జల నిర్వహణ (soil and water management India Israel), పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, సీడ్ ఇంప్రూవ్మెంట్, ప్యాలెస్ మేనేజ్‌మెంట్ సహా అనేక రంగాల్లో పరస్పర సహకారానికి కార్యాచరణ ప్రణాళిక (India Israel work plan horticulture)ను ఇరు దేశాలు అంగీకరించాయి.

రైతులకు లాభమయ్యే మార్గాలు

ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాలు కలిసి ఫైవ్ ఇయర్ సీడ్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ (FYSIP) పై పనిచేయనుండగా, దీని ఫలితంగా రైతులకు అధిక దిగుబడినిచ్చే, వాతావరణ మార్పులకు తట్టుకునే నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి. విత్తనాల ఉత్పత్తిలో ఇజ్రాయిల్ నైపుణ్యం, భారత విస్తృత భూభాగం, జనాభా ఉన్నట్టుండి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ లక్ష్యాలకు తోడ్పడనుంది (seed improvement cooperation).

India Israel work plan horticulture, Shivraj Singh Chouhan Israel MoU (Image Courtesy: PIB)
India Israel work plan horticulture, Shivraj Singh Chouhan Israel MoU (Image Courtesy: PIB)

కోఇ సెంటర్లు – విజన్ ఆఫ్ ఎక్సలెన్స్

ఇప్పటికే దేశవ్యాప్తంగా 35 పైగా సెంటర్ అఫ్ ఎక్సెలెన్స్ (Centers of Excellence CoE) కేంద్రాలు విజయవంతంగా పనిచేస్తుండగా, ప్రతి కోఇ కేంద్రానికి 30 గ్రామాలను అనుసంధానించి ఒక గ్రామ నైపుణ్య (Villages of Excellence VoE) మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు భారత్, ఇజ్రాయిల్ యోచిస్తున్నాయి. ఇది గ్రామీణాభివృద్ధికి కీలకంగా మారనుంది.

డిజిటల్ వ్యవసాయం పై ఇజ్రాయిల్ ఆసక్తి

భారతదేశంలో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ద్వారా రైతులను టెక్నాలజీతో కలిపి బలోపేతం చేయడం ఇజ్రాయిల్‌కు ఆకర్షణగా మారింది. భవిష్యత్తులో ఈ రంగంలో రెండు దేశాల మౌలికంగా పనిచేయనున్నాయి.

రైతులకు ఇది లాభమా?

ఇజ్రాయిల్‌కు ఉన్న ఆధునిక వ్యవసాయ సాంకేతికత, చిన్న స్థలంలో అధిక దిగుబడి సాధించే సామర్థ్యం, మైక్రో ఇరిగేషన్ వంటి పద్ధతులు భారతదేశంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులకు మేలు చేయగలవు. అయితే ఈ ఒప్పందాల్లో ప్రైవేటు సంస్థల దూకుడుతో దేశీయ విత్తన సంస్థలు, స్థానిక విత్తన వైవిధ్యం నష్టపోతుందన్న ఆందోళన కూడా కొందరిలో వ్యక్తమవుతోంది.

ఒప్పందాలు (Shivraj Singh Chouhan Israel MoU)

  • ఒప్పంద అంశాలు: విత్తనాల అభివృద్ధి, సాంకేతిక మార్పిడి, R&D, కోఇ కేంద్రాలు, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ (post-harvest technology India Israel).
  • లక్ష్యం: అధిక దిగుబడి, వాతావరణ పరిస్థితులకు తట్టుకునే వ్యవసాయం, రైతులకు మార్కెట్ లింకేజులు.
  • భవిష్యత్ దిశ: ఐదు సంవత్సరాల ప్రణాళిక, సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుతో నిర్దిష్ట లక్ష్యాల పై కార్యాచరణ.

ఈ ఒప్పందం భారత రైతులకు అవకాశాలతో పాటు అవగాహన, నిఘా కూడా అవసరమని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. అగ్రికల్చర్‌లో అగ్రదేశం ఇజ్రాయిల్‌తో కలిసి భారత్ సాగిస్తున్న ఈ ప్రయాణం మార్గదర్శకంగా నిలవనుంది.

Read More:

కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు మొత్తం ఇవే! ప్రతీ రైతు తప్పకుండ చదవాలి!!

ఇవి ప్రతీ రైతుకి తెలియలిసిన పథకాలు! ఎండాకాలం తస్మాత్ జాగ్రత్త...

Share your comments

Subscribe Magazine

More on News

More