News

సారూ.... కొంచెం గడ్డి ధర తగ్గించరూ

Sandilya Sharma
Sandilya Sharma
AP dairy sector summer 2025- AP livestock feed crisis- drought impact on fodder (Image Courtesy: Pexels)
AP dairy sector summer 2025- AP livestock feed crisis- drought impact on fodder (Image Courtesy: Pexels)

పులివెందుల నియోజకవర్గం పశుగ్రాసం కొరతతో విలవిల్లాడుతోంది (fodder shortage Pulivendula 2025). ఈ వేసవి తీవ్రత (Pulivendula summer fodder problem), పంటల అగ్ని ప్రమాదాలు, వర్షాభావం కారణంగా రైతులకు జీవాలను పోషించడం కష్టంగా మారింది. పశుగ్రాసానికి మితిమీరిన ధరలు, దాని కొరత పాడి రైతులపై భారం పెంచాయి. ఒక్కో ట్రాక్టర్ వేరుశనగ కట్ట ధర రూ.25 వేలు దాటినట్లు (groundnut hay price hike AP) రైతులు వాపోతున్నారు. అంతే కాకుండా, ఈ గ్రాసం దూరప్రాంతాల్లో మాత్రమే లభ్యమవుతున్నది. దీనితో రవాణా ఖర్చులు పెరిగి మరింత భారంగా మారింది.

ఈ నియోజకవర్గంలో 4,390 మంది పాడిరైతులు ఉన్నారు. మండలాల వారీగా చూస్తే చక్రాయపేటలో 960 మంది, లింగాలలో 650 మంది, సింహాద్రిపురంలో 630, పులివెందులలో 530, వేములలో 520, తొండూరులో 410, వేంపల్లిలో 660 మంది పాడి రైతులు జీవనోపాధిగా పశుపోషణపై ఆధారపడుతున్నారు. గతంలో రైతులు వేరుశనగ, జొన్న, కొర్ర వంటి పంటల ద్వారా పశుగ్రాసాన్ని సిద్ధం చేసుకునే వారు. కానీ ఇప్పుడు అధిక పెట్టుబడి భయంతో ఆ పంటల సాగుపై వెనకడుగు వేస్తున్నారు.

ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు మరింత పెరిగాయి. కొందరు పొలాల్లో ఎండు గడ్డిని కాల్చడానికి నిప్పు పెట్టగా, మరికొందరు పశువుల కాపరులు అజాగ్రత్తగా బీడీలు పడేసి మంటలు వ్యాపించాయి. మామిడి, నిమ్మకాయ చెట్లు దగ్ధమై రైతులు నష్టపోయారు. చుట్టుపక్కల గుట్టలు ఎండిపోయి మేత దొరకని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో రైతులు తమ పాడి పశువులను అమ్ముకోవాల్సిన దుస్థితికి గురవుతున్నారు.

బోనాల గ్రామానికి చెందిన ఒక రైతు మాట్లాడుతూ, ‘‘నాలుగు పాడిపశువులను ఎనిమిదేళ్లుగా పెంచుతున్నాను. నెలకు ఒక్క ట్రాక్టర్ వరిగడ్డి ఖర్చు రూ.25 వేలు అవుతోంది (fodder transport cost Andhra). ఇంత ధర చెల్లించి పోషించలేక, ఒక పశువును అమ్మేశాను’’ అని వాపోయారు. పులివెందులకు చెందిన మరో  పాడి రైతు మాట్లాడుతూ, ‘‘గ్రాసం కొని మేపే పరిస్థితి లేదు. ప్రభుత్వం రాయితీపై దాణా అందిస్తే ఎంతో ఊరట కలుగుతుంది’’ అన్నారు.

ప్రస్తుతం పశు బీమా కార్యక్రమం కొనసాగుతున్నప్పటికీ, సబ్సిడీపై గ్రాసం పంపిణీపై ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు విడుదలవుతున్నాయా లేదా అన్నదే ప్రశ్నగా మిగిలింది. అధికారుల మాట ప్రకారం, సమాచారం వచ్చిన వెంటనే పశుపోషకులకు తెలియజేస్తామని తెలిపారు. అయితే, ఆ సమయంలోకి ముందు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది (dairy farmer crisis Andhra Pradesh).

Read More:

పాడిపరిశ్రమకు భారీ ప్రోత్సాహకాలు – గోకుల్ మిషన్, NPDD, NDLM వివరాలు…

తొలకరి వాన కోసం పొలాలను సిద్ధం చేసుకోండి- రైతులకి ముఖ్య సూచన

Share your comments

Subscribe Magazine

More on News

More