News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు: సుస్థిర వ్యవసాయానికి తెలంగాణ రాష్ట్ర నూతన ప్రణాళిక

Sandilya Sharma
Sandilya Sharma
Sustainable farming practices Telangana - Scientists awareness programs for farmers - Telangana agricultural reforms - Climate-resilient farming methods India
Sustainable farming practices Telangana - Scientists awareness programs for farmers - Telangana agricultural reforms - Climate-resilient farming methods India

రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో విస్తృత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మే 5 నుంచి జూన్ 13వ తేదీ వరకు "రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు" అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా రైతుల వద్దకు శాస్త్రవేత్తలను తీసుకెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నెత్తిన బాద్యత తీసుకుంది.

ఈ సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రత్యేక ఏర్పాట్లు మొదలయ్యాయి. రైతులకు సుస్థిర సాగు విధానాలు, పంటల పరిరక్షణ, తక్కువ పెట్టుబడిలో అధిక దిగుబడులు సాధించే పద్ధతులపై శాస్త్రీయ సూచనలు ఇవ్వనున్నారు. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న మార్పిడి వాతావరణ పరిస్థితులు, నీటి కొరత, భూమి సారభూమి తగ్గడం వంటి ప్రధాన సవాళ్లను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు ప్రత్యక్షంగా పరిష్కార మార్గాలను సూచించనున్నారు.

ప్రధాన లక్ష్యాలు:

  • సుస్థిర వ్యవసాయ విధానాలపై అవగాహన పెంచడం
  • రైతులను నష్టాల నుంచి గట్టెక్కించి లాభదాయక వ్యవసాయ మార్గాల వైపు చైతన్యవంతం చేయడం

  • వ్యవసాయ అనుబంధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించడం

  • రైతులకు నూతన సాంకేతికతలు పరిచయం చేయడం

ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కార్యక్రమం: ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె. రవికుమార్ సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నారు. అలాగే జిల్లా వ్యవసాయశాఖ డీఏఓ ధనసరి పుల్లయ్య సహకారంతో అధికారులు కూడా ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

క్షేత్రస్థాయిలో పాల్గొనే సంస్థలు:

  • కృషి విజ్ఞాన కేంద్రాలు (KVKs)
  • డాట్ సెంటర్లు

  • వ్యవసాయ పరిశోధన సంస్థలు

  • వ్యవసాయ కళాశాలలు

  • వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు

అవగాహన బృందం:

  • ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 2 శాస్త్రవేత్తలు

  • జిల్లా వ్యవసాయ శాఖ నుంచి 2 అధికారులు

  • వ్యవసాయ కళాశాలల నుంచి 2 విద్యార్థులు

  • అభ్యుదయ రైతులు

  • ఇతర సంబంధిత శాఖల అధికారులు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ద్వారా ప్రతి రైతుకు తక్షణ సహాయం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. సాంకేతికత ఆధారంగా రైతుల అభివృద్ధికి ఈ అవగాహన కార్యక్రమం దోహదం చేయనుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

Read More:

ఇండియాలో భూమిలేని వ్యవసాయం: ఇంట్లోనే ఐదు లాభదాయక వ్యవసాయ మార్గాలు

తక్కువ పెట్టుబడి, అధిక లాభం: మఖానా సాగుతో రైతుకు రూ.2.5 లక్షల ఆదాయం

Share your comments

Subscribe Magazine

More on News

More