News

రూ. 400 కోట్ల విలువైన పేడ! మన పూర్వీకుల పద్ధతులు ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ట్రెండ్‌

Sandilya Sharma
Sandilya Sharma
Indian Livestock Farming- Cow Dung Uses in Farming- Gulf Countries Agriculture Trends- Organic Fertilizer from Cow Dung- Sustainable Farming Methods (Image Courtesy: Google AI)
Indian Livestock Farming- Cow Dung Uses in Farming- Gulf Countries Agriculture Trends- Organic Fertilizer from Cow Dung- Sustainable Farming Methods (Image Courtesy: Google AI)

న్యూఢిల్లీ: భారతదేశం పశుసంపద పరంగా సంపన్న దేశాల్లో ఒకటి. గ్రామీణ జీవన విధానంలో భాగంగా రైతులు వ్యవసాయంతో పాటు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నల వంటి పశువులను పెంచుతూ జీవనోపాధిగా చేసుకుంటున్నారు. వీటి నుండి వచ్చే పేడను సంప్రదాయంగా ఎరువుగా వినియోగిస్తూ పంటల దిగుబడి పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే పద్ధతి గల్ఫ్ దేశాల్లోనూ ట్రెండ్‌గా మారింది.

గోమయానికి అరబ్ దేశాల్లో పెరుగుతున్న డిమాండ్

ఆవు పేడ పొడిని ఖర్జూర పంటల దిగుబడి పెంపునకు వినియోగించడం ద్వారా అరబ్ దేశాల వ్యవసాయ పరిశోధకులు గణనీయమైన ఫలితాలను సాధించారట. ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో గోమయ వినియోగం భారీగా పెరుగుతోంది. ఖర్జూర ఉత్పత్తిలో ఇది సహాయకారి కావడంతో, ఇప్పుడు భారతదేశం నుంచి గోమయాన్ని ఎగుమతి చేయడంపై ఆసక్తి నెలకొంది.

విజ్ఞాన ఆధారిత వినియోగం

అరబ్ దేశాల్లో గోమయ వినియోగం కేవలం సంప్రదాయ నమ్మకాల ఆధారంగా కాదు. శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత, ఖర్జూర పంటల్లో గోమయం పొడి వాడకం ద్వారా పరిమాణం, రుచి, దిగుబడి అన్నింటిలోనూ మెరుగుదల కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వ స్థాయిలోనూ, ఇటు ప్రైవేటు వ్యవసాయ కంపెనీలు కూడా గోమయం దిగుమతికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

Agriculture in Telugu States- Krishi Jagran Telugu Farming News- Indian Farming Traditions- Rural Indian Livelihoods  (Image Courtesy: Google AI)
Agriculture in Telugu States- Krishi Jagran Telugu Farming News- Indian Farming Traditions- Rural Indian Livelihoods  (Image Courtesy: Google AI)

రూ. 400 కోట్ల ఎగుమతులు

2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అరబ్ దేశాలకు జరిగిన గోమయ ఎగుమతుల విలువ రూ.400 కోట్లు దాటినట్లు వాణిజ్య వర్గాల సమాచారం. ఒక్కో కిలో గోమయం ధర రూ.30 నుంచి రూ.50 మధ్య పలుకుతోంది. గత ఏడాది నుండి ఈ డిమాండ్ మరింతగా పెరగడంతో ఇప్పుడు గోమయ ఉత్పత్తి, ప్యాకేజింగ్, ఎగుమతుల ప్రక్రియ మరింత ప్రొఫెషనల్ స్థాయిలో మారుతోంది.

భారత పశుసంరక్షకులకు ఇదొక అవకాశమే!

ఈ అభివృద్ధి పశుపోషక రైతులకు ఆదాయ మార్గంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో గోమయాన్ని గ్లోబల్ మార్కెట్‌కు సరఫరా చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించనుంది.

గతంలో మన ఊరి వ్యవసాయ పద్ధతుల్లో మాత్రమే వినియోగించబడే గోమయం, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో విలువైన వస్తువుగా మారింది. కేవలం మన శాస్త్రీయ సంపత్తినే కాకుండా, సంప్రదాయ జ్ఞానాన్ని కూడా ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. గోమయంతో నిక్షిప్తమైన ఈ సేంద్రీయ ఉద్యమం భారత వ్యవసాయ రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చనుందని నిపుణుల అభిప్రాయం.

Read More:

2025 బ్రిక్స్ వ్యవసాయ సమావేశంలో భారత్ కీలక పాత్ర: చిన్న రైతుల సంక్షేమానికి మద్దతు

రాష్ట్ర రైతులకు మరో శుభవార్త: కొత్తగా 50,000 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు

Share your comments

Subscribe Magazine

More on News

More