News

Rain Alert: ఆంధ్రాలో వర్షాలు, పిడుగులు......రైతులకి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక!

Sandilya Sharma
Sandilya Sharma
AP weather update April 2025- Kurmanath disaster management AP (Image Courtesy: Google Ai)
AP weather update April 2025- Kurmanath disaster management AP (Image Courtesy: Google Ai)

రాష్ట్రంలో వాతావరణం అస్థిరంగా మారుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు (thunderstorms warning Andhra). ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎండలు – వానలు రెండూ ఒకేసారి (Andhra Pradesh weather instability)!

ఈసారి కర్నూలులో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా (Kurnool highest temperature), అనకాపల్లి జిల్లా చీడికాడలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది (Anakapalli rainfall). ఈ విరుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ప్రజలు రహదారులపై ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజ్‌లు పొంగిపొర్లిపోవడంతో రహదారులు జలమయమయ్యాయి.

రైతులకు భారీ నష్టం (Farmer Loses)

ఈదురు గాలులతో పాటు వచ్చిన వర్షాలకు పలు జిల్లాల్లో పంట నష్టం సంభవించింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిర్చి తడిసి ముద్దవుతున్నాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నారు. మామిడి రైతులు ఇప్పటికే నాలుగు సార్లు ఈదురు గాలులకు బలై 60 శాతం కాయలను కోల్పోయారు.

నైరుతి రుతుపవనాల్లో శుభవార్త (Monsoon alert)

ఇంతలో, భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సీజన్‌ (జూన్‌-సెప్టెంబర్‌)లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాతో రైతులకు ఊరటనిచ్చింది. ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముంది (North Andhra rain alert). రాయలసీమ అంతటా అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు (Rayalaseema weather news). ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని తెలిపారు.

తెలంగాణలో వర్షాల సూచన – ఆరెంజ్ అలర్ట్

ఇక పొరుగున తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్ష సూచనల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఖమ్మం, నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో వర్ష సూచన ఉన్నట్టు వెల్లడించారు. మరోవైపు ములుగు, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పిడుగులు, ఈదురు గాలులు ఉన్న సమయంలో ఆహార భద్రతతో పాటు పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని హెచ్చరిస్తున్నారు.

Read More:

ఈ రోజు నుండి మొదలైన వేట నిషేధం! ఉల్లంఘింస్తే అంతే!! మత్స్యభరోసా రాదా?

ఏపీలో మరో వారం రోజుల పాటు వర్షాలు – రైతులకు హెచ్చరిక

Share your comments

Subscribe Magazine

More on News

More