Agripedia

భారీ వర్షాలకు 62 వేల ఎకరాలలో పంట నష్టం

KJ Staff
KJ Staff
62 thousand acres of crop loss due to floods in Kakinada
62 thousand acres of crop loss due to floods in Kakinada

ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్‌లకు వరద నీరు వచ్చి చేరడంతో కాకినాడ జిల్లాలో 62 వేల ఎకరాల వ్యవసాయ పొలాలు నీట మునిగి నట్లు ప్రాథమిక సమాచారం.

కాకినాడ జిల్లా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలేరు జలాశయం పొంగిపొర్లుతున్న  సమయం లో పర్యటించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ షాన్‌మోహన్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు జరిగిన నష్టాన్ని వివరించారు.

పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని షాన్‌మోహన్‌ డిప్యూటీ సీఎంకు తెలిపారు.

పిఠాపురం-రాపర్తి, పెద్దాపురం-గుడివాడ, సామర్లకోట-పిఠాపురం మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ & మేనేజ్‌మెంట్ సిస్టమ్ (APWRIMS) ప్రకారం, రాష్ట్రంలోని 108 రిజర్వాయర్లు 78 శాతం సామర్థ్యంతో నిండి, 773 TMC నీటిని నిల్వ చేయగా, ఏలేరు రిజర్వాయర్ దాని సామర్థ్యంలో 90 శాతానికి పైగా 22 TMC వద్ద నిండి ఉంది.

అయితే ఇన్‌ఫ్లోలు క్రమంగా తగ్గుతున్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Related Topics

#Normal Rainfall

Share your comments

Subscribe Magazine