News

2023లో దిగుబడిని పెంచే వ్యవసాయ ట్రెండ్స్ ! భారతీయ రైతులు తప్పకుండా తెలుసుకోవాలి

Sriya Patnala
Sriya Patnala
Agricultural trends that you should follow in 2023 to double the income
Agricultural trends that you should follow in 2023 to double the income

ఈ రోజుల్లో సాంకేతికతతో పని లేకుండా ఏ వృత్తి, ఉద్యోగాలు లేవు. వ్యవసాయానికి మట్టి ఉంటె చాలు టెక్నాలజీ తో మనకేం పని అని అనుకుంటే రానున్న రోజుల్లో వ్యవసాయ రంగం అన్నిటికన్నా వెనకపడిపోయే ప్రమాదం ఉంది.

కాబట్టి మన రైతులు కూడా , తాజా పోకడలు మరియు సాంకేతికతలు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండటం చాలా అవసరం. భారతీయ రైతులు అధిక దిగుబడిని పొందడానికి 2023లో బాగా ప్రాచుర్యం పొందుతున్న కొన్ని అగ్ర వ్యవసాయ పోకడలు ఇప్పుడు చూద్దాం.

1. ఆర్గానిక్ వ్యవసాయం: ఇప్పుడు దేశం లో ఎక్కడ చుసిన వినిపించే మాట ఇది. ఆర్గానిక్ పంటలకు , ఆహారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . ఈ పెరుగుతున్న ధోరణికి అనుగుణంగా , రైతులు ఎక్కువగా సేంద్రీయ వ్యవసాయం, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని తగ్గించే ఇతర పద్ధతుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు పొందవచ్చు.

2. వర్టికల్ (నిలువు) వ్యవసాయం: ఈ వ్యవసాయ పద్దతిలో విజయం సాధించి లక్షల్లో సంపాదింస్తున్న రైతులు కోకొల్లలు. వర్టికల్ ఫార్మింగ్ అనేది కృత్రిమ లైటింగ్ , నియంత్రిత ఉష్ణోగ్రత మరియు తేమను ఉపయోగించి నిలువుగా పేర్చబడిన పొరలలో పంటలను పండించే పద్ధతి. ఈ సాంకేతికత ముఖ్యంగా పట్టణ ప్రాంతాలలో ఉపయోగపడుతుంది, ఇక్కడ భూమి తక్కువగా ఉండడం వళ్ళ, ప్రతి చదరపు అడుగు భూమిని,చక్కగా వినియోగిస్తూ, అధిక దిగుబడిని పొందవచ్చు.

3. ప్రెసిషన్ వ్యవసాయం: పంటలు మరియు మట్టిని మరింత సమర్ధవంతంగా నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడాన్ని ప్రెసిషన్ వ్యవసాయం అంటారు. సెన్సార్లు, డ్రోన్లు వంటి సాధనాలను ఉపయోగించడం ద్వారా, రైతులు పంట పెరుగుదల, నేలలో తేమ శాతం, చీడ పీడల దాడి , వంటి అంశాలను సరైన సమయంలోనే గుర్తించి నష్టం జరగక ముందే తగిన చర్యలు తీస్కోవచ్చు .దీనివల్ల , తక్కువ ఖర్చుతో, పంట నష్టాన్ని నివారిస్తూ అధిక దిగుబడులు సాదించవచ్చు.

ఇది కూడా చదవండి

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం..దీనివల్ల ప్రయోజనాలు మరియు నష్టాలు

4. పంటల వైవిధ్యం: ఒక భూమిలో పదే పదే ఒకే పంట వేయడం వళ్ళ క్రమేణా నెలలో సారం తగ్గిపోయి దిగుబడులు కూడా తగ్గిపోతాయి.
కాబట్టి రైతులు పంట నష్టాన్ని తగ్గించుకొని , దిగుబడిని పెంచుకోవడానికి బహుళ పంటల సాగు పాటించాలి . తమ పంటలను వైవిధ్యపరచడం ద్వారా, మట్టిలో మల్లి పోషకాలు సమకూర్చడంతో పాటు, రైతులు వివిధ మార్కెట్ పరిస్థితులను కూడా సద్వినియోగం చేసుకోవచ్చు.

5. డిజిటల్ వ్యవసాయం: డిజిటల్ వ్యవసాయం అనేది పంట కోత కోసి , మార్కెట్ లో అమ్మే వరకు జరిగే వివిధ వ్యవసాయ లావాదేవీలను మెరుగుపరచడానికి సాంకేతికతను ఉపయోగించడం. ఇది రైతులు తమ పంట అమ్మేటపుడు , కొనుగోలుదారులతో నేరుగా కనెక్ట్ అవ్వడానికి సహాయపడుతుంది, ఇది అధిక దిగుబడి మరియు ఎక్కువ లాభదాయకతకు దారి తీస్తుంది.

ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా, రైతులు తమ వ్యవసాయ కార్యాలను సులభతరం చేసుకొని, మారుతున్న వాతావరణం మరియు పెరుగుతున్న జనాభా యొక్క సవాళ్లను ఎదుర్కోవచ్చు మరియు రాబోయే సంవత్సరాల్లో అభివృద్ధి చెందవచ్చు.

ఇది కూడా చదవండి

వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం..దీనివల్ల ప్రయోజనాలు మరియు నష్టాలు

Share your comments

Subscribe Magazine