News

పిడుగుపాట్ల బాధితులకు రూ.4 లక్షల పరిహారం.... ఏపీ ప్రభుత్వం తక్షణ ఆదేశాలు

Sandilya Sharma
Sandilya Sharma
AP government compensation to farmers  పిడుగుపాట్ల పరిహారం  చంద్రబాబు రైతు సహాయం
AP government compensation to farmers పిడుగుపాట్ల పరిహారం చంద్రబాబు రైతు సహాయం

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, పిడుగుపాట్ల కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు, బాధిత కుటుంబాలకు అండగా నిలిచింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. పిడుగుపాట్లకు బలైన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం విడుదల చేయడం జరిగింది.

విపత్తుల నిర్వహణ శాఖ తక్షణంగా స్పందించి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగుపాట్ల కారణంగా మృతిచెందిన తొమ్మిది మంది కుటుంబాలకు పరిహారం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటికే ఏడుగురి కుటుంబాలకు చెక్కుల పంపిణీ పూర్తయ్యింది. మిగిలిన రెండు కుటుంబాలకు గృహనిర్మాణ శాఖ మంత్రి శ్రీ పార్థసారథి ఈరోజు చెక్కులను అందజేయనున్నారు.

ఇక పంట నష్టాల విషయంలో, అధికారులు సర్వే ప్రక్రియ చేపట్టారు. వ్యవసాయ శాఖ ప్రకారం, పంట నష్టాలను అంచనా వేయడానికి కనీసం పది రోజులు పడనుందని వెల్లడించింది. గతంలో ఇలాంటి ప్రక్రియలకు 20 రోజుల సమయం పట్టినప్పటికీ, ప్రస్తుతం ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు.

రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడినట్టు స్పష్టం చేసింది. పంట నష్టం వివరాలను సేకరించిన వెంటనే, రైతుల ఖాతాల్లో నేరుగా పెట్టుబడి సాయం జమ చేయనున్నారు. పంటలు నాశనమై జీవనోపాధి నష్టపోయిన రైతులకు ఈ చర్యలు కొంత ఊరటనివ్వనున్నాయి.

ప్రభుత్వ తక్షణ చర్యలు, బాధిత కుటుంబాలపై చూపిన మానవతా దృక్పథం రైతుల హృదయాలను దక్కించుకున్నాయి.

విపత్తుల సమయంలో ప్రభుత్వం వెంటనే స్పందిస్తుండడం రైతులకు భరోసా కలిగిస్తోంది. ఇకపై కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతులతోనే ఉందని, అవసరమైన అన్ని విధాలుగా అండగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Read More :

సెక్స్‌ సార్టెడ్‌ సెమన్‌ ద్వారా పశువుల్లో ఆడ దూడల వృద్ధి! కేవలం 250 రూపాయిలే

మే 20వ తారీఖు మర్చిపోకండి – రూ.20,000 ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రైతుల అర్హత జాబితా సిద్ధం

Share your comments

Subscribe Magazine

More on News

More