News

వ్యవసాయంలో నూతన అధ్యాయాలకు శ్రీకారం: KJ చౌపాల్ లో బ్రెజిలియన్ ఎంబస్సి

Sriya Patnala
Sriya Patnala
Brazil Embassy Visits KJ choupal, Krishi Jagran
Brazil Embassy Visits KJ choupal, Krishi Jagran

వ్యవసాయం మరియు రైతుల అభివృద్ధి కోసం 26 సంవత్సరాలుగా కృషి జాగారణ్ నిరంతర కృషి గురించి కొత్తగా కొత్తగా చెపేది లేదు .
భారత దేశమే కాక, ఎన్నో దేశాల నుండి , వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం పనిచేసే నిపుణులను కృషి జాగరణ్ కు ఆహ్వానిస్తుంది

ఈ విషయమై , కృషి జాగరణ్ సంస్థకు ఈరోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే బ్రెజిల్‌ ఎంబసీ నుండి వ్యవసాయ నిపుణులు కృషి జాగరణ్ కుటుంబంలో చేరారు.కృషి జాగారం ఆహ్వానాన్ని మన్నించి, kj చౌపాల్ లో పాల్గొని , వ్యవసాయ రంగంలో తమ అనుభవాలను పంచుకున్నారు.

బ్రెజిలియన్ ఎంబస్సి కి చెందిన ఈ సభ్యులు దేశ వ్యవసాయం మరియు రైతుల కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తున్న కృషి జాగరణ్ సంస్థ మరియు సంపాదకుడు MC డొమినిక్ కృషిని కూడా ప్రశంసించారు. బ్రెజిలియన్ ఎంబసీలోని ఇద్దరు సభ్యులు, ఏంజెలో (వ్యవసాయం అటాచ్ - వ్యవసాయం, పశువులు & బ్రెజిల్ ఆహార సరఫరా మంత్రిత్వ శాఖ) మరియు ఫ్రాంక్ (ఇంటెలిజెన్స్ బ్రెజిల్‌ను అటాచ్ )కృషి జాగ్రన్ సభ్యులందరితో ఉత్సాహంగా మాట్లాదారు. MC డొమినిక్ , చీఫ్ ఫౌండర్ మరియు ఎడిటర్, కృషి జాగరణ్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన సంస్థలోని ఇతర సీనియర్ సిబ్బంది ఆయనతో కలిసి పాల్గొన్నారు.

ఇంత సానుకూలతో తో పని చేస్తున్న కృషి జాగరణ్ మీడియా కృషి అభినందనీయమని అన్నారు. కృషి జాగరణ్ అనేది ఇతర మీడియాలతో పోల్చలేనిది , ఇది రైతులు మరియు వ్యవసాయ రంగాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తుంది, ఇది చాలా ప్రశంసనీయమైన పని. రైతు సోదరుల సంక్షేమం కోసం ఈ కృషి చేస్తున్న కృషి జాగరణ్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ఇప్పుడు రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, మీడియా రైతుల వద్దకు వెళ్లి ఇవన్నీ తెలుసుకోవాలని.. వారి సమస్యలను వారితో మాట్లాడి సమాచారం పొందాలన్నారు.అంతేకాకుండా వారు బ్రెజిల్ కి , భారత దేశానికీ ఉన్న పోలికలు, ఏకభావాల గురించి మాట్లాడుతూ, కృషి జాగరణ్ను సందర్శించడం ఎంతో సంతోషకరం అని తెలిపారు.

Share your comments

Subscribe Magazine