News

FAO: తీవ్రమైన కరువు గుప్పెట్లో "గాజా' ప్రజలు...

KJ Staff
KJ Staff

గత కొన్ని నెలలుగా గాజాలో నెలకొన్న యుద్ధవాతావరణ పరిస్థితుల గురించి మనకి తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ మరియు గాజా మద్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశం మొత్తం యుద్దవాతావరణం నెలకొనడంతో కడుపు నింపుకోవడానికి ఆహరం దొరక్క ఎంతోమంది ప్రజలు ఆకలి గుప్పెట్లో మగ్గిపోతున్నారు. ఎఫ్ఏఓ నివేదిక ప్రకారం సుమారు 96% శాతం ప్రజలు కరువు పరిస్థితులతో అల్లల్లాడుతున్నారు. వీరిలో 22% మంది ఆకలి విపత్తు పరిస్థితిలో ఉన్నట్లు FAO గుర్తించింది. దీనితోపాటు సుమారు 57% వ్యవసాయం భూమి యుద్ధం వలన దెబ్బతిన్నట్లు FAO నివేదికలో పేర్కొంది.

 

యుద్ధం వలన సహాయకచర్యలు చేపట్టడం, కష్టతరంగా మారింది. అనేక దేశాలు గాజా ప్రజల సహాయార్ధం, ఆహారం పంపిస్తున్న సరే అది ప్రజలకు సరైన సమయంలో చేరడం లేదు. దాదాపు 96 శాతం మంది తీవ్రమైన ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎఫ్ఏఓ తన సహాయకచర్యలను ముమ్మరం చేసింది. తాజాగా విడుదల చేసిన ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ (IPC) నివేదిక ప్రకారం ఈ ప్రాంతంలో భయంకరమైన పరిస్థితులను గురించి మరియు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ప్రస్తావించింది.

కొనసాగుతున్న సహాయక చర్యలతో ఉత్తర గాజాలోని పరిస్థితులు కాస్త అదుపులో ఉన్నట్లు FAO తాజాగా జరిపిన అధ్యనంలో తేలింది, కానీ ఈ ప్రాంతంలో పరిస్థితి ఎప్పుడెలా మారుతుందో తెలియని పరిస్థితో, అధికారులు సన్ధిగ్నంలో పడ్డారు. గాజా ప్రాంతం మీద అధ్యయనం జరుపుతున్న FAO చీఫ్ ఎకనామిస్ట్, గాజాలో జరుగుతున్న అన్ని పరిస్థితులు సామాజిక మరియు ఆహార భద్రత పరిస్థితులను మరింత దిగజార్చాయని సూచించారు.IPC Phase 5 నివేదిక ప్రకారం మానవతా సహాయంలో గణనీయమైన పెరుగుదల జరగకపోతే మరింత మంది వ్యక్తులను విపత్తుకరమైన ఆకలి స్థాయిలకు నెట్టే ప్రమాదం ఉందని పేర్కొంది. ప్రస్తుతం, దాదాపు 495,000 మంది ప్రజలు లేదా జనాభాలో 22 శాతం మంది విపత్తుకరమైన ఆహార అభద్రతా స్థితిలో ఉన్నారని తెలియచేసింది.

FAO యొక్క ఇటీవలి జరిపిన ఉపగ్రహ విశ్లేశణ డేటా ఆధారంగా గాజాలోని వ్యవసాయ భూమికి విస్తృతమైన నష్టం వాటిల్లిందని తేలింది, మే 2024 నాటికి 57 శాతానికి పైగా భూమి ప్రభావితమైంది. ఇందులో పండ్ల తోటలు (61 శాతం), కూరగాయల పొలాలు (19 శాతం) మరియు తృణధాన్యాల పంటలు (20 శాతం) దెబ్బతిన్నాయి. . ఈ వివాదం వ్యవసాయ మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం చూపింది, గ్రీన్‌హౌస్‌లు, బావులు, సోలార్ ప్యానెల్‌లు మరియు ఇతర సౌకర్యాలను తీవ్రంగా దెబ్బతిన్నాయి.

గాజా ఉపరితల వైశాల్యంలో వ్యవసాయ భూభాగం 40 శాతానికి పైగా విస్తరించి, రోజువారీ ఆహార ఉత్పత్తిలో ఎంతగానో దోహదపడేది. వ్యవసాయ క్షేత్రాలు దెబ్బతినడంతో వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు గణనీయమైన ఆదాయ నష్టాలను మిగిల్చింది. ఈ నష్టంతో ఎంతమంది తమ ఆదాయంలో 72 శాతం వరకు తగ్గుదల చూస్తున్నారు. గాజా నగర నౌకాశ్రయం కూడా భారీగా దెబ్బతింది, ఇది మత్స్య పరిశ్రమను ప్రభావితం చేసింది మరియు పశువుల సంఖ్య బాగా తగ్గింది.

ఆకలి చావులను నియంత్రించడానికి FAO, సహా ఇతర మానవతా సంస్థలు , గాజాకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నా లాజిస్టికల్ సవాళ్లు ఈ సహాయచర్యలకు అడ్డంకిగా మారాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ, FAO 500 టన్నుల పశుగ్రాసాన్ని పంపిణీ చేసి, దాదాపు 2,900 మంది వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చింది. యాక్సెస్ అనుమతులపై ఆకస్మికంగా, గాజాకు రవాణా చేయడానికి సంస్థ అదనపు ఆహార ఉత్పత్తి ఇన్‌పుట్‌లను సిద్ధం చేస్తోంది.

గాజాలోని ఈ సంక్షోభానికి ప్రతిస్పందనగా, UN ఆక్రమిత పాలస్తీనా భూభాగం కోసం ఒక ఫ్లాష్ అప్పీల్‌ను ప్రారంభించి, $40 మిలియన్లను సహాయ చర్యల కోసం కోరింది, ఇందుకు గాను గాజాకు $29 మిలియన్లు మరియు వెస్ట్ బ్యాంక్‌కు $11 మిలియన్లు కేటాయించబడ్డాయి. ఈ నిధులు అత్యవసర వ్యవసాయ సహాయాన్ని అందించడం, పశువులను పునరుద్ధరించడం మరియు రైతులకు కీలకమైన ఇన్‌పుట్‌లను సరఫరా చేయడంలో సహాయపడతాయి. 70,000 మందికి పైగా ప్రజలకు సహాయం చెయ్యడానికి సన్నద్ధమవుతుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల మూలంగా పూర్తి స్థాయి కరువును నివారించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Share your comments

Subscribe Magazine

More on News

More