News

కిసాన్ ఈ-మిత్ర, రైతుల AI మిత్రుడు

Sandilya Sharma
Sandilya Sharma

రైతులకు మేలు చేసేలా వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం వేగంగా విస్తరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యల పరిష్కారానికి AI ఆధారిత పద్ధతులను ప్రవేశపెట్టింది.

రైతులకు AI తో సత్వర పరిష్కారం

  • "కిసాన్ ఈ-మిత్ర", కృత్రిమ మేధస్సుతో పనిచేసే చాట్‌బాట్, PM కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు అందిస్తుంది.
  • బహుళ భాషలలో ప్రావిణ్యం ఉన్న ఈ చాట్‌బాట్, ఇతర ప్రభుత్వ పథకాల కోసం కూడా అభివృద్ధి చెందుతోంది.

  • ప్రస్తుతం ఒకరోజుకి 20,000 రైతుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, ఇప్పటివరకు 92 లక్షలకుపైగా ప్రశ్నలకు పరిష్కారం అందించింది.

పురుగుల నియంత్రణకు నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్

  • AI, మెషీన్ లెర్నింగ్ ఆధారంగా పంటలకు కలిగే పురుగుల ముప్పును ముందుగానే గుర్తించే "నేషనల్ పెస్ట్ సర్వేలెన్స్ సిస్టమ్" ఏర్పాటు.
  • రైతులు పురుగుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయడం ద్వారా, పురుగుల దాడిని అరికట్టే చర్యలు చేపట్టే అవకాశం.
  • 61 పంటలు, 400కి పైగా పురుగుల నియంత్రణకు ఈ వ్యవస్థ సహాయపడుతోంది.

అధునాతన పంట ఆరోగ్య నిర్ధారణ 

  • వాటర్, మట్టిలో తేమ, ఉపగ్రహ చిత్ర ఆధారంగా ధాన్యం, గోధుమ పంటల ఆరోగ్య స్థితిని మానిటరింగ్ చేయడం.
  • రైతులకు పంట నష్టాలను తగ్గించి, అధిక దిగుబడులు సాధించే మార్గదర్శనం.

వాడేది ఎలా?

కిసాన్ ఈ-మిత్ర ని వాడటం చాల సులభతరం. ఫోన్లోనుంచి కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. కేవలం  https://chatbot.pmkisan.gov.in  వెబ్ పేజీని తెరిచి అందులో పిఎం-కిసాన్ లేదా కిసాన్ క్రెడిట్ కార్డ్ లేదా ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన ఏ ప్రశ్న అయినా అడగవచ్చు.  

AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలు రైతులకు కొత్త మార్గాలు చూపిస్తున్నాయి. "కిసాన్ ఈ-మిత్ర" వంటి చాట్ బాట్ రైతుల మిత్రులుగా మారి, వ్యవసాయాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి.

Share your comments

Subscribe Magazine