News

'తిరుపతి లడ్డు వివాదం: లడ్డు పంపిణీ ప్రదేశాలలో ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి : మాజీ మంత్రి ప్రభు

KJ Staff
KJ Staff
Prabhu Proposes Food Testing Labs at 'Prasadam' Distribution Centers Amid Tirupati Laddu Controversy
Prabhu Proposes Food Testing Labs at 'Prasadam' Distribution Centers Amid Tirupati Laddu Controversy

కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు శనివారం తిరుపతి లడ్డూ మరియు ఇతర ప్రసాదాల నాణ్యతను నిర్ధారించడానికి, ప్రసాదం పంపిణీ చేసే ప్రతి బహిరంగ ప్రదేశంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ద్వారా ఆహార పరీక్షల ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు .

ఈ ఆహార పరీక్షల ల్యాబ్‌ల నిర్వహణకు అవసరమైన వ్యయాన్ని ఇలాంటి పెద్ద కార్యక్రమాలను నిర్వహించే సంస్థలు సులభంగా భరించగలవని ఆయన అభిప్రాయపడ్డారు.

కొన్ని రోజుల క్రితం , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తిరుపతి లడ్డూలలో జంతు కొవ్వు ఉపయోగించారనే ఆరోపణలు చేసి పెద్ద రాజకీయ దుమారాన్ని సృష్టించారు. ఈ ఆరోపణలను వైఎస్‌ఆర్‌సిపి ఖండిస్తూ, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ఆరోపణలు చేశారని ఆరోపించింది. ఈ వివాదంలో, టిడిపి ల్యాబ్ నివేదికలను చూపిస్తూ తమ వాదనను రుజువు చేయడానికి ప్రయత్నించింది.

"తిరుపతి ప్రసాదం నాణ్యత విషయంలో ప్రజలు, భక్తులు అనుకుంటున్న ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా, ప్రసాదం పంపిణీ చేసే అన్ని బహిరంగ ప్రదేశాల్లో ఆహార పరీక్షల ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలి," అని ప్రభు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Related Topics

Tirumala Tirupati

Share your comments

Subscribe Magazine

More on News

More