News

SBI క్రెడిట్ కార్డుదారులకు ఇకపై ఆ బెనిఫిట్స్ ఉండవు.....

KJ Staff
KJ Staff

ప్రభుత్వరంగ బ్యాంకు సంస్థల్లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. దేశంలోనే అతి పెద్ద ఆర్థిక సంస్థగా ఎస్బిఐ గుర్తింపు పొందింది. అయితే ఎస్బిఐ చేసిన కొన్ని కీలక మార్పులు క్రెడిట్ కార్డు వినియోగదారులకు కొంత అసంతృప్తి కలిగిస్తుంది. ఈ మార్పుల ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా జరిపే లావాదేవీల నుండి లభించే అదనపు లాభం పొందేందుకు అవకాశం పోనున్నది.

ఇప్పటివరకు ఎస్బిఐ క్రెడిట్ కార్డు ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేసినవారికి కొన్ని రివార్డ్స్ లభించేవి, వినియోగదారులు ఈ రివార్డ్స్ తమ తదుపరి లావాదేవీల్లో వినియోగించుకునేవారు. అయితే ఎస్బిఐ తమ రివార్డ్స్ ప్రోగ్రాం లో కొన్ని కీలక మార్పులు చేపట్టింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డులతో జరిపే ప్రబుత్వ సంబంధిత లావాదేవీలపై, ఇకనుండి రివార్డ్ పాయింట్లు లభించవని కీలక ప్రకటన చేసింది. ఈ మార్పులు 2024 జూన్ నుండి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయంతో క్రెడిట్ కార్డుదారులు ప్రభావితం కానున్నారు.

ఎస్బిఐ విభిన్న శ్రేణిలో క్రెడిట్ కార్డులు అందిస్తుంది, ఈ నిర్ణయం మూలంగా ఈ కార్డులు అన్నిటిమీద ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఉన్న రివార్డు నిర్మాణాన్ని క్రమబద్దీకరించి, వినియోగదారుల మెరుగుపరచడం కోసం ఎస్బిఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆధునిక ప్రయాణాలకు మారుతున్న అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో మైల్స్ కార్డులు పరిచయం చేసిన తర్వాత ఎస్బిఐ ఈ మార్పులు చెప్పట్టింది. దీని మూలంగా 50 రకాల క్రెడిట్ కార్డు, క్రెడిట్ పాయింట్స్ ప్రభవితం కానున్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More