Agripedia

రబీ సీజన్ 2022-23కుగాను సూక్ష్మ ఎరువులపై సబ్సిడీ కి కేంద్రం మంత్రిమండలి ఆమోదం!

Srikanth B
Srikanth B

2022 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 వరకూ ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై పోషకాధారిత సబ్సిడీ రేట్లకు మంత్రిమండలి ఆమోదం.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి- ఎరువులపై సూక్ష్మ పోషకాధారిత సబ్సిడీ (NBS ) పరిమితికి ఆమోదం తెలిపింది. ఈ మేరకు నత్రజని (ఎన్‌), భాస్వరం (పి), పొటాష్ (కె), గంధకం (ఎస్‌) సూక్ష్మ పోషక ఎరువులకుగాను కిలోగ్రాముకు వర్తించే సబ్సిడీపై కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ ప్రతిపాదించిన రేట్లకు ఆమోదముద్ర వేసింది. తదనుగుణంగా రబీ సీజన్-2022-23 (01.10.2022 నుంచి 31.03.2023 వరకు)లో ఫాస్పేట్‌, పొటాష్‌, సల్ఫర్ ఎరువులపై సబ్సిడీ రేట్లు కిందివిధంగా ఉంటాయి.

పొటాషియం పై సబ్సిడీ కిలోగ్రాముకు :23. 65

సల్ఫేర్ సబ్సిడీ కిలోగ్రాముకు 98. 02

పాస్ఫరస్ పై సబ్సిడీ కిలోగ్రాముకు :66. 93

మిగిలిన సూక్ష్మపోషకాలపై పై సబ్సిడీ కిలోగ్రాముకు 6. 12

రబీ-2022 (01.10.2022 నుండి 31.03.2023 వరకు)కుగాను మంత్రిమండలి ఆమోదించిన ‘NBS ’ సబ్సిడీ మొత్తం రూ. 51,875

ఈ నిర్ణయంతో 2022-23 రబీలో రైతులకు ‘పి అండ్‌ కె’ ఎరువులన్నీ సబ్సిడీ/సరసమైన ధరలకు సజావుగా లభిస్తాయి. తద్వారా వ్యవసాయ రంగానికి చేయూత ఉంటుంది. ఆ మేరకు ఎరువులు, ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలలో అస్థిరత్వ భారాన్ని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది.

ఇది కూడా చదవండి .

పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం((NBS) అంటే ఏమిటి?

దేశంలోని ఎరువుల తయారీ/దిగుమతిదారుల ద్వారా రైతులకు సబ్సిడీ ధరతో యూరియా సహా 25 గ్రేడ్‌ల ఎరువులను ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది. వీటిలో ‘పి అండ్‌ కె’ ఎరువులపై సబ్సిడీని 01.04.2010 నుంచి ‘ఎన్‌బీఎస్‌’ పథకం కింద పర్యవేక్షిస్తోంది. ఆ విధంగా తన కర్షకహిత విధానాలకు అనుగుణంగా రైతుకు సరసమైన ధరలతో ‘పి అండ్‌ కె’ ఎరువులు లభించేలా చూసే బాధ్యతను నిర్వర్తిస్తోంది.

ఎరువులు, ఉత్పాదక సరంజామా.. అంటే- యూరియా, డిఎపి, ఎంఓపి, సల్ఫర్‌ల అంతర్జాతీయ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో రైతులపై భారం పడుతుంది. కాబట్టి ‘డిఎపి’ సహా ‘పి అండ్ కె’ ఎరువులపై సబ్సిడీ పెంపు ద్వారా ఆ భారాన్ని స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సరసమైన ధరతో రైతాంగానికి ఎరువులు లభ్యమయ్యేలా ఆమోదిత ధరల ప్రకారం ఎరువుల కంపెనీలకు సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేస్తుంది.

ఇది కూడా చదవండి .

పోషకాల ఆధారిత సబ్సిడీ పథకం((NBS) అంటే ఏమిటి?

ఉద్యానవన సాగుతో రైతులు వారి ఆదాయాన్ని రెండింతలు చేసుకోవచ్చు : కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్

 

Share your comments

Subscribe Magazine