Agripedia

చేపల ఉత్పత్తుల పెంపకం పై సెమినార్ నిర్వహించిన మత్స్య, పశుసంవర్ధ శాఖ !

Srikanth B
Srikanth B

చేపల ఉత్పత్తుల పెంపకం పై సెమినార్ నిర్వహించిన మత్స్య, పశుసంవర్ధ శాఖ !

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా “ఘనీభవించిన చేపలు మరియు చేపల ఉత్పత్తులను ప్రోత్సహించడం” అనే అంశంపై కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖలు 2022 నవంబర్ 29న జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించాయి. మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ అధ్యక్షతన జరిగిన వెబినార్ లో పారిశ్రామికవేత్తలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల మత్స్య శాఖ అధికారులు , రాష్ట్ర వ్యవసాయం, వెటర్నరీ మరియు మత్స్య విశ్వవిద్యాలయాల అధ్యాపక సిబ్బంది, మత్స్య పరిశోధనా సంస్థలు, మత్స్య సహకార అధికారులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు మరియు దేశవ్యాప్తంగా మత్స్య పరిశ్రమ నుంచి వాటాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ సంయక్త కార్యదర్శి శ్రీ సాగర్ మెహ్రా తన స్వాగత ఉపన్యాసంలో మత్స్య శాఖ అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ప్రాధాన్యత అమలు జరుగుతున్న తీరు, మత్స్య రంగం ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అట్టడుగు వర్గాలకు పోషకాహారం అందించడానికి, దేశంలో చేపల వినియోగాన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.ప్రపంచ మత్స్యమార్కెట్‌లలో అనిశ్చితి ఏర్పడినప్పుడు తలెత్తే పరిస్థితిని ఎదుర్కోవడానికి దేశీయంగా చేపల వినియోగాన్ని పెంపొందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారతదేశం రిస్క్ మిటిగేషన్ ప్లాన్ రూపొందిందని అన్నారు.

డిజిటల్ రూపాయి పై వడ్డీ లభిస్తుదా ? రేపు అందుబాటులో డిజిటల్ రూపాయి..ఎలా వాడాలి ?

వెబినార్ లో మత్స్య శాఖ కార్యదర్శి శ్రీ జతీంద్ర నాథ్ స్వైన్ ముఖ్య ఉపన్యాసం ఇచ్చారు. చేపలు తింటున్న వారి సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా ఘనీభవించిన చేపలు మరియు మత్స్య ఉత్పత్తుల విక్రయానికి ఎక్కువ చేయడానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఘనీభవించిన చేపలు మరియు చేపల ఉత్పత్తులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని రావడానికి అమలు చేస్తున్న ప్రణాళికను ఆయన ప్రస్తావించారు. వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడానికి ఎగుమతి చేస్తున్న మత్స్య సంపద విషయంలో అమలు చేస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఘనీభవించిన చేపలు మరియు చేప ఉత్పత్తులకు అమలు చేయాలని అన్నారు. అవసరమైన లేబులింగ్, ధృవపత్రాలతో దేశీయ మార్కెట్‌కు విస్తరించాలని ఆయన సలహా ఇచ్చారు. అదనంగా,పట్టణ ప్రాంతాలు , సెమీ-అర్బన్ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో మరియు వినియోగదారుల సంఖ్యను పెంచడానికి ఇతర ఉత్పత్తుల సరఫరాకు ఉపయోగిస్తున్న వ్యవస్థ ద్వారా ఘనీభవించిన చేపలు మరియు చేప ఉత్పత్తులను సరఫరా చేయడానికి గల అవకాశాలను అన్వేషించాలని సూచించారు.

Share your comments

Subscribe Magazine