Animal Husbandry

"భారత దేశ పాడి పరిశ్రమను నడిపిస్తుంది 75 శాతం మహిళలే "-ప్రధాని మోడీ

Srikanth B
Srikanth B
IDF World Dairy Summit 2022
IDF World Dairy Summit 2022


గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్‌పో సెంటర్ & మార్ట్‌లో 12 సెప్టెంబర్ 2022న ఉదయం 10:30 గంటలకు నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డైరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ (IDF WDS) 2022ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు .

సెప్టెంబరు 12 నుండి 15 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించబడుతున్న IDF WDS 2022, 'డైరీ ఫర్ న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్' అనే ఇతివృత్తం చుట్టూ పరిశ్రమల నాయకులు, నిపుణులు, రైతులు మరియు పాలసీ ప్లానర్‌లతో సహా ప్రపంచ మరియు భారతీయ డెయిరీ వాటాదారుల సమ్మేళనం. IDF WDS 2022లో 50 దేశాల నుండి దాదాపు 1500 మంది పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి చివరి సమ్మిట్ భారతదేశంలో అర్ధ శతాబ్దం క్రితం 1974లో జరిగింది.

ఇంటర్నేషనల్ డెయిరీ ఫెడరేషన్ వరల్డ్ డైరీ సమ్మిట్ 2022ని ప్రారంభించన అంతరం ప్రధాని ప్రసంగిస్తూ గ్రామీణ పాడి రైతులు , కో -ఆపరేటివ్ సొసైటీ , భారత్ దేశ పశు జాతులు దేశం యొక్క పాడి పరిశ్రమను ప్రపంచంలోనే బిన్నమైనదిగా నిలిపియాయని, పాడి పరిశ్రమలో 75 శాతం మహిళలు కల్గిన ఏకైక దేశంగ భారత దేశం ప్రత్యేకతను చాటుకుందని వెల్లడించారు , అదేవిదం గ డైరీ సెక్టార్ ఏటా 8. 5 లక్షల కోట్ల ఆర్థిక వాటాను కల్గి ఉందని ఇది మిగిలిన రంగాల కంటే అధికమని ధాన్యాలైన వ రి , గోధుమలకంటే అధికం
అని తెలిపారు .

డైరీ రంగం కేవలం గ్రామీణ రంగాలకు మాత్రం ఉపాధి కల్గించేది కాదు ఏది ప్రపఞ్చ వ్యాప్తం గ దాన్ని సంబంధిత రంగాలకు ఉపాధిని కల్గించడం లో కీలక పాత్ర లాగిస్తుంది , భారత దేశ సంస్కృతిలో కొన్ని వేళా సంవస్త్రకళనుంచి పాలయొక్క ప్రాముఖ్యత గుర్తించబడింది .

నూకల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం..కారణాలేంటి..?

గ్రామీణ ప్రాతాల చిన్న రైతుల కృషి భారత దేశంను నేడు పాల ఉత్పత్తి లో ప్రపంచంలొనె మొదటి స్థానం లో నిల్చేలా చేసిందని , పాల ఉపాథి సరఫరాలో కో -ఆపరేటివ్ సోసై టి లో కీలక పాత్ర పోషిస్తున్నాయని, భారత దేశం లో పది పరిశ్రమ అభివృద్ధి దేశంగా ప్రభుత్వం పటు పడుతుందని దానిలో భాగం గ రాష్ట్రీయ గోకుల్ మిషన్ , గోవర్ధన్ యోజన , డైరీ సెక్టార్ డిజిటలైసెషన్ , పశువులకు యూనివర్సల్ వాక్సిన్ నైజెషన్ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం చేపడుతుందని , దీనితో పాటు సంబంధిత రంగాలను FPO లతో మిళితం చేయనున్నట్లు ప్రధాని తెలిపారు .

2025 వరకు గాలికుంటూ వ్యాధి పూర్తి స్థాయి నిర్ములన దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది అదేవిదం గ గత కొంత కలం గ భారత దేశాన్ని పట్టిపీడిస్తున్న లింఫి వ్యాధికి స్వదేశీ వ్యాక్సిన్ ను రూపొందించుకుంది , ప్రపంచ దేశాలలో సాంకేతికతలతో భారతదేశం పోటీపత్తుతుంది, డైరీ సెక్టార్ లో సాధికారత దిశగా ఇంటెర్నేషనల డైరీ ఫెడరేషన్ కృషి ను ప్రధాని అభినందించారు.

నూకల ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్ర ప్రభుత్వం..కారణాలేంటి..?

Share your comments

Subscribe Magazine

More on Animal Husbandry

More