Government Schemes

ఏపీ పాడి రైతులకు శుభవార్త షెడ్ నిర్మాణానికి 70% వరకు సబ్సిడీ, గడ్డి సాగుకు రూ.15,000 సాయం

Sandilya Sharma
Sandilya Sharma
విజయవాడ "Tech AI 2.0" సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించిన పథకాలు
విజయవాడ "Tech AI 2.0" సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించిన పథకాలు

పాడి రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్‌ఫర్మేషన్ (GFST) ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన "టెక్ AI 2.0" సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి పలు పథకాలను ప్రకటించారు. ముఖ్యంగా పాడి రైతులకు టెక్నాలజీ ఆధారిత సేవలను అందించేందుకు డిజిటల్ డ్యాష్‌బోర్డ్ ను ప్రారంభించారు.

డ్యాష్‌బోర్డ్ ద్వారా పాడి రైతులకు టెక్నాలజీ సహాయం

పాడి రైతులకు సంబంధించిన సమాచారం, పశుసంబంధిత రుణాలు, సబ్సిడీలు ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీ సహకారంతో రైతుల ఆదాయం పెరిగేలా ఈ పథకం రూపకల్పన చేశారు. పశువుల ఆరోగ్యం, పోషణ, మార్కెట్ ధరలు వంటి విషయాలు రైతులు ఈ డ్యాష్‌బోర్డ్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

పశు షెడ్లపై పన్ను మినహాయింపు 

పశువుల షెడ్ నిర్మాణంపై గ్రామీణ ప్రాంతాల్లో విధించబడే పన్నును ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. దీని వల్ల చిన్న, సన్నకారు రైతులు భారీగా లబ్దిపొందనున్నారు. దీనితో పాటు షెడ్ నిర్మాణానికి రూ.50,000 నుంచి రూ.1 లక్ష వరకు ఖర్చు అయ్యే షెడ్లపై 50-70 శాతం వరకు సబ్సిడీ ఇవ్వనుంది.

దరఖాస్తు ప్రక్రియ 

షెడ్ నిర్మాణానికి దరఖాస్తు చేయాలనుకుంటే, రైతులు స్థానిక పశుసంవర్ధక శాఖ కార్యాలయాన్ని లేదా మీ సేవా కేంద్రాలను సంప్రదించాలి. అలాగే గ్రామ సచివాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవసరమైన పత్రాలు సమర్పించి, షెడ్ కోసం అనుమతి పొందొచ్చు.

తక్కువ వడ్డీ రుణాలు 

రైతులు షెడ్ నిర్మాణానికి అవసరమైన తగిన మొత్తాన్ని తక్కువ వడ్డీ రేటుతో జాతీయ లేదా సహకార బ్యాంకుల ద్వారా రుణంగా పొందవచ్చు. సాధారణంగా 4%–6% వడ్డీతో ఈ రుణాలు లభిస్తాయి. ప్రభుత్వం బ్యాంకులకు హామీగా నిలవడం వల్ల రుణం పొందడం సులభతరం అవుతుంది.

గడ్డి పెంపకం కోసం ప్రత్యేక సబ్సిడీ

పశువుల ఆహార ఖర్చును తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడ్డి సాగుకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తోంది. ఎకరాకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు సబ్సిడీ అందించనున్నారు. ఈ సొమ్ముతో రైతులు విత్తనాలు, ఎరువులు, నీటి వనరుల ఏర్పాటుకు ఖర్చుచేయొచ్చు. వేగంగా పెరిగే మరియు పశువులు ఇష్టపడే గడ్డి రకాలపై వ్యవసాయ నిపుణుల నుంచి సూచనలు తీసుకుని రైతులు సమర్థవంతంగా గడ్డి సాగు చేసుకోవచ్చు.

టెక్ AI 2.0 సదస్సు ఫోకస్ 

ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, పశుసంవర్ధక రంగం రాష్ట్ర GSDPలో ప్రస్తుతం 11.23 శాతంగా ఉందని, దానిని 20 శాతానికి పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. ‘కౌ ఆధార్’, లంపీ స్కిన్ వ్యాక్సిన్, ఇతర టెక్నాలజీ ఆధారిత పద్ధతులను వ్యవస్థలో తీసుకురావాలని తెలిపారు. రైతులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపి, వారి అవసరాలపై స్పందించారు.

అన్నదాత సుఖీభవ పథకం అమలుకు సన్నాహాలు

ఈ చర్యలతో పాటు, జూన్ 12న అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అదే రోజున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందు ఈ సాయం రైతులకు పెట్టుబడి సహాయంగా ఉపయోగపడనుంది.

రైతులకు భరోసా, రాష్ట్రానికి అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యలు పాడి రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా, వ్యవసాయం–పశుసంవర్ధక రంగాలను పరస్పర బలోపేతం చేసే దిశగా ఉన్నాయి. టెక్నాలజీ, సబ్సిడీలు, స్థిరమైన ఆదాయ మార్గాలు కలగలసిన ఈ పథకాల అమలు ద్వారా రాష్ట్ర రైతులకు పెద్దగా ఉపశమనం లభించనుంది.

Read More:

Rythu Bharosa Update: నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, అప్పటిలోగా సబ్సిడీ జమ!

Annadatha Sukheebhava Update: ఆరోజు నుండి అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం, సీఎం చంద్రబాబు

Share your comments

Subscribe Magazine

More on Government Schemes

More