Horticulture

ఉద్యాన పంటలకు ప్రభుత్వం పెద్దపీట: 14,195 ఎకరాల విస్తరణకు రూ.2.62 కోట్లు

Sandilya Sharma
Sandilya Sharma
ఉద్యాన పంటల సాగు  ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ  రైతులకు రాయితీ పథకాలు
ఉద్యాన పంటల సాగు ఆంధ్రప్రదేశ్ ఉద్యాన శాఖ రైతులకు రాయితీ పథకాలు

ఉద్యాన పంటలకు భారీ రాయితీలు – సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రభుత్వం విశేష ప్రయత్నం

రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు విశేషంగా రాయితీలు అందిస్తూ ఉద్యాన విస్తరణకు మార్గం వేసింది. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో పలు పథకాల ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని జిల్లాలో 1.10 లక్షల ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటలను సాగుచేస్తున్నారు. వీటి ద్వారా ఏటా 1.55 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తోందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2025-26 ఆర్థిక సంవత్సరానికి 14,195 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరణ లక్ష్యంగా ప్రభుత్వం రూ.2.62 కోట్లు కేటాయించింది.

రైతులకు అవగాహన, శిక్షణ, మొక్కల సరఫరా

ఉద్యాన విస్తరణలో భాగంగా రైతులకు అవసరమైన నర్సరీ మొక్కలు సబ్సిడీపై అందిస్తారు. అలాగే సాగుపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని పూలు, పండ్ల సాగు కోసం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ముఖ్యంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగుకు రాయితీని గత ఏడాది రూ.30 వేల నుంచి ఈసారి రూ.1.62 లక్షలకు పెంచడం విశేషం.

డ్రిప్ పరికరాలకు రాయితీలు ఇలా

ఉద్యాన సాగుకు అవసరమైన డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను కూడా రాయితీపై అందిస్తున్నారు.

  • 5 ఎకరాల లోపు భూమి కలిగిన ఎస్సీ, ఎస్టీ రైతులకు – 100 శాతం రాయితీ
  • బీసీ, ఓసీ రైతులకు – 90 శాతం రాయితీ
  • 5 నుండి 10 ఎకరాల భూమి ఉన్న రైతులకు – 70 శాతం రాయితీ
  • 10 ఎకరాల పైబడి భూమికి – 50 శాతం రాయితీ

విస్తరణ లక్ష్యాలు ఇలా

ప్రభుత్వం వేర్వేరు పథకాల కింద వివిధ విభాగాల సహకారంతో ఉద్యాన విస్తరణ చేపడుతోంది.

పథకం

విస్తీర్ణం (ఎకరాల్లో)

సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్

995

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన

150

ఆయిల్‌పామ్ మిషన్

2,000

జాతీయ వెదురు మిషన్

25

పంట వైవిద్యీకరణ పథకం

150

ఉపాధి హామీ ద్వారా తోటల విస్తరణ

3,150

కొబ్బరి విస్తరణ

750

అనువైన బీడు భూముల గుర్తింపు

8,875

రాయితీ రేట్లు ఇలా పెరిగాయి

పంట రకం

గత ఏడాది (రూ.)

ప్రస్తుతం (రూ.)

డ్రాగన్ ఫ్రూట్

30,000

1,62,000

జీడి

12,000

18,000

మామిడి

7,980

30,000

జామ

17,599

48,000

కొబ్బరి

12,000

18,000

అరటి

30,000

42,000

పూల తోటలు

16,000

20,000

కూరగాయలు (హైబ్రిడ్)

20,000

24,000

నిమ్మ

9,602

30,000

పైనాపిల్

26,000

26,000

బొప్పాయి

18,000

18,000

దరఖాస్తు విధానం

రాయితీల కోసం ఐదు ఎకరాల లోపు భూమి ఉండడం తప్పనిసరి. రైతులు పట్టాదారు పాస్‌బుక్‌, ఆధార్‌, బ్యాంకు ఖాతా జిరాక్స్‌, ఒక ఫొటోతో

  • రైతు సేవా కేంద్రాల్లో
  • ఉద్యానవన శాఖ/వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హుల ఖాతాల్లో నేరుగా రాయితీ జమ చేస్తారు.

ఉద్యాన సాగుకు తగిన నీటి వసతి కలిగించుకొని పంటలు సాగు చేస్తే, ప్రభుత్వ రాయితీలతో రైతులు మంచి లాభాలు పొందవచ్చు. గతంలో లేని స్థాయిలో రాయితీలు ఇస్తున్నాం. రైతులు డ్రాగన్‌ఫ్రూట్ లాంటి డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి పెట్టాలి అని, ఉద్యానవనశాఖ అధికారి దుక్క శరత్‌రెడ్డి చెబుతున్నారు.  

మొత్తానికి, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ఉద్యానవన రంగాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తాయని, రైతులకు స్థిర ఆదాయ మార్గాలను అందిస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

Read More:

తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం: ఆయిల్ పామ్ సాగు రైతులకు బంగారు అవకాశం!

పత్తి రైతులకు శుభవార్త: సేంద్రియ సాగుతో తిరిగి లాభాల బాటలోకి!

Share your comments

Subscribe Magazine

More on Horticulture

More