Kheti Badi

ఖరీఫ్ పంటలకు అందుతున్న కనీస మద్దతు ధర పూర్తి వివరాలు!

S Vinay
S Vinay

మరికొన్ని రోజుల్లో వర్షాకాల పంటల (ఖరీఫ్) సాగు ప్రారంభం కానుంది,అయితే ఈ తరుణంలో రైతులు వేయబోయే పంటలకు, ప్రభుత్వ అందిస్తున్న కనీస మద్దతును ధర వివరాలు తెలుసుకోండి.

ఏయే పంటకి ఎంత కనీస మద్దతు ధర అందివ్వాలో , వ్యవసాయ ఖర్చులు & ధరల కమిషన్ (Commission for Agricultural Costs & Prices) సూచిస్తుంది. అయితే తుది నిర్ణయం మాత్రం కేంద్ర ప్రభుత్వానిదే.Commission for Agricultural Costs & Prices అనేది భారత ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ యొక్క అనుబంధ కార్యాలయం. ఇది జనవరి 1965లో ఉనికిలో ప్రారంభమయింది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించేలా రైతులను ప్రోత్సహించడానికి మరియు ఉత్పాదకత మరియు మొత్తం ధాన్యం ఉత్పత్తిని పెంచడానికి కనీస మద్దతు ధరలను (MSPs) సిఫార్సు చేయడం తప్పనిసరి. అయితే కనీస మద్దతు ధరని నిర్ణయించేముందు ఆయా పంటకి సాగుకి అయ్యే ఖర్చుకి కనీసం 1.5 రెట్లు ఉండేలా చూసుకుంటుంది.

కనీస మద్దతు ధర వివరాలు:

ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధరలను తప్పనిసరి చేసింది అందులో ఖరీఫ్ సీజన్‌లో 14 పంటలు, రబీలో 6 పంటలు, మరో రెండు వాణిజ్య పంటలు ఉన్నాయి.

ఖరీఫ్ పంటలు:

వరి సాధారణ రూ.1940

వరి గ్రేడ్ 'A' రూ.1960

జొన్న హైబ్రిడ్ రూ. 2738

జొన్న మల్దండి రూ.2758

సజ్జలు రూ.2250

మొక్కజొన్న రూ.1870

రాగి రూ.3377

కంది రూ.6300

పెసర్లు రూ.7275

మినుములు రూ.6300

పత్తి మీడియం స్టేపుల్ రూ.5726

పత్తి లాంగ్ స్టేపుల్ రూ.6025

వేరుశెనగ రూ.5550

ప్రొద్దుతిరుగుడు రూ.6015

సోయాబీన్ రూ.3950

నువ్వులు రూ.7307

కుసుమ రూ.6930

మరిన్ని చదవండి.

మొక్కలలో పోషక లోపాల లక్షణాలు మరియు అధిక మోతాదు వల్ల సంభవించే నష్టాలు!

 

Share your comments

Subscribe Magazine