News

రైతుల ఖాతాల్లో 1,180 కోట్లు.. చురుకుగా ధాన్యం కొనుగోళ్లు !

Srikanth B
Srikanth B
రైతుల ఖాతాల్లో 1,180 కోట్లు.. చురుకుగా ధాన్యం కొనుగోళ్లు !
రైతుల ఖాతాల్లో 1,180 కోట్లు.. చురుకుగా ధాన్యం కొనుగోళ్లు !

రాష్ట్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ ఐకేపీ సెంటర్ ల ద్వారా చురుకుగా కొనసాగుతుందని .. నిధులను విడుదల చేయడంలో ఎటువంటి జాప్యం లేదని పౌర సరఫరాల శాఖామంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు .


రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతుల ఖాతాలో శుక్రవారం ఒక్కరోజే రూ.1180 కోట్లను రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని పేర్కొన్నారు . రైతులకు ఇబ్బంది కలగకుండా సకాలంలో నిధులు విడుదల చేస్తున్నామని . రాష్ట్రంలో చురుగ్గా కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్లకు నిధుల ఇబ్బంది లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏక మొత్తంలో శుక్రవారం ఒక్కరోజే రూ.1180 కోట్లను రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు జమ చేశామని తెలిపారు .

జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 7030 పైగా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరిస్తున్న ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామని వాటికి అనుగుణంగా రైతుల ఖాతాలకు నిధులను బదిలీ చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ధాన్యం డబ్బులను సకాలంలో విడుదల చేస్తుందన్నారు .

జులై లో రైతుబంధు .. కొత్త దరఖాస్తు వల్ల ఆలస్యం ..!

Share your comments

Subscribe Magazine