News

జులై 27 న రైతుల ఖాతాలో 14 విడత పీఎం కిసాన్ డబ్బులు .. స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?

Srikanth B
Srikanth B

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క 14వ విడత కోసం రైతులు ఆశక్తిగా ఎదురుచుస్తున్నారు ఫిబ్రవరిలో ప్రధాని మోదీ 13వ విడతను విడుదల చేసారు , మీడియా కథనాల ప్రకారం ఇప్పుడు రైతుల నిరీక్షణకు అతి త్వరలోనే తెరపడనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 14వ విడత జూలై 27న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది.రాజస్థాన్ జరిగే బహిరంగ సభ లో ప్రధాని పీఎం కిసాన్ 14 వ విడుదల చేయనున్నారు.

 

పీఎం కిసాన్ 14 విడత స్టేటస్ ఎలా చెక్ చేయాలి ?



https://pmkisan.gov.in/ అనే వెబ్సైటు ను సందర్శించి. క్రింద కనిపించే ఫార్మర్ కార్నర్ లో KNOW YOUR స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి . తరువాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిస్తే రిజిస్టేషన్ నెంబర్ టైపు చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చ పై ఎంటర్ చేసి గెట్ డేటా పై క్లిక్ చేయాలి అంతే ఇప్పుడు మీరు మీ స్క్రీన్ పై స్టేటస్ పొందుతారు . ఒక వేల రెజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే పక్కనే ఉన్న నో రిజిస్టరైన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఇక్కడ మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకటి ఆధార్ ఇంకొకటి మొబైల్ నెంబర్ రెండిటిలో ఏదయినా టైపు చేసి మీరు పై రిజిస్టరైన్ నెంబర్ పొందుతారు. ఈ రిజిస్టేషన్ నెంబర్ తో ఇప్పుడు మీరు సులువుగా స్టేటస్ చెక్ చెయ్యవచు.

గుడ్ న్యూస్: ప్రభుత్వం రిటైల్ టొమాటో ధరలను కిలోకు రూ.70కి తగ్గుదల..


13 వ విడత అందని రైతులు ఎం చెయాలి?

13వ విడత అందని అర్హులైన రైతులు PM కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్ 011-24300606 మరియు 155261 కు పిర్యాదు చేయవచ్చు. లేదా రైతులు తమ ఫిర్యాదులనుpmkisan-funds@gov.inలేదా pmkisan-funds@gov.in ఇమెయిల్ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

గుడ్ న్యూస్: ప్రభుత్వం రిటైల్ టొమాటో ధరలను కిలోకు రూ.70కి తగ్గుదల..

Related Topics

PMKISANSAMANNIDI

Share your comments

Subscribe Magazine