News

తెలంగాణలో వరదల ధాటికి 5.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం ..

Srikanth B
Srikanth B
తెలంగాణలో వరదల ధాటికి 5.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం ..
తెలంగాణలో వరదల ధాటికి 5.5 లక్షల ఎకరాల్లో పంటనష్టం ..

తెలంగాణాలో భారీ వర్షాల కారణంగా జన జీవనం స్తంభించింది మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వరద ఉద్రితికి 30 మంది కొట్టుకుపోగా, 18 వరకు చనిపోయినట్లు ప్రాథమిక సమాచారం.

మరో 12 మంది గల్లంతు అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో వాగులు ఉప్పొంగటంతో పలు గ్రామాలు వరదనీట మునిగాయి. జంపన్న వాగులో కొట్టుకు పోయి 8 మంది మరణించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లిని వరదనీరు ముంచెత్తింది. దీనితో మోరంచపల్లి గ్రామస్థులు ఇళ్లపైనా , ఇంటి సజ్జలపైకి ఎక్కి ప్రాణలను కాపాడుకున్నారు .


భారీ వర్షాలకు గోదావరి, ప్రాణహిత నదులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి . నిర్మల్ జిల్లా సిరాల చెరువుకు గండి పడటంతో 150 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరదల వల్ల పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ మోయతుమ్మెద వాగు వరద ప్రవాహంతో రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. భద్రాచలం వద్ద వరదనీటి మట్టం 53.1 అడుగులకు చేరుకోవడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

వరదల వల్ల తెలంగాణాలో 5.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు . తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరిజిల్లాలలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది.

రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Related Topics

ap rain alert

Share your comments

Subscribe Magazine