News

తెలంగాణ రైతులు అలర్ట్: రైతు బీమా దరఖాస్తులకు చివరి తేదీ ప్రకటన... ఎప్పుడంటే?

KJ Staff
KJ Staff

తెలంగాణ రాష్ట్ర రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం,రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకురావడం కోసం రైతులకు ఇప్పటి వరకు రైతు బంధు పథకం అమలులోకి తీసుకువచ్చింది. అదేవిధంగా రైతు బీమా పథకాన్ని కూడా రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రెండు పథకాలకు రైతులందరూ అర్హులు. రైతు బంధు పథకం ఒకసారి నమోదు చేసుకుంటే ప్రతిసారీ ఆ పథకం ద్వారా వచ్చే డబ్బులను పొందవచ్చు. కానీ రైతు భీమా పథకం ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదవశాత్తు అన్నదాతలు ఎవరైనా చనిపోతే వారి కుటుంబానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలను ఆర్థిక సహాయంగా ప్రకటించింది.

ఇప్పటివరకు ఎవరైతే ఈ పధకంలో అనర్హులుగా ఉంటారో అలాంటి వారు ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చని తెలంగాణ సర్కార్ వెల్లడించింది.ఎవరైతే ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీలోగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉంటారో అలాంటి రైతులు రైతు బీమా పథకానికి అర్హులుగా తెలుపుతూ వెల్లడించింది. అలాంటి రైతులు ఆగస్టు 11వ తేదీలోగా రైతు బీమా పథకానికి అప్లై చేసుకోవాలని సూచించింది. ఈ పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల రైతులు మాత్రమే అర్హులు.వీరి ఆధార్ కార్డులో ఉన్న వయసు ఆధారంగా తీసుకుంటారు.

అదేవిధంగా ఓకే రోజుకు రెండు మూడు చోట్ల భూమి ఉన్నప్పటికీ కేవలం ఒక చోటకు మాత్రమే ఈ బీమా వర్తిస్తుంది. ఈ పథకానికి దరఖాస్తు చేయాలంటే రైతు వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి.ఈ నెల 11వ తేదీలోగా దరఖాస్తు చేయలేకపోతే మరో ఏడాది పాటు ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. కనుక ఎవరైతే రైతు బీమా పథకానికి దరఖాస్తు చేయకుండా ఉంటారో అలాంటి రైతులు ఆగస్టు 11వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

Share your comments

Subscribe Magazine