News

ఏపీ ప్రజలకు అలర్ట్‌..రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు !

Gokavarapu siva
Gokavarapu siva

ఏపీ ప్రజలకు బిగ్ అలెర్ట్… రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు మిథిలి తుఫాను గండం పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుంది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాతావరణశాఖ హెచ్చరికలను కూడా జారీ చేసింది.

ఆగ్నేయ బంగాళాఖాతం.. దానికి ఆనుకొని అండమాన్ సముద్రం.. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో ఇవాల్టి నుంచి తూర్పుగాలులు బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వాతావరణ అంచనాలు ప్రస్తుత నెల 21వ తేదీ నుండి 23వ తేదీ వరకు దక్షిణ కోస్తా వెంబడి అనేక ప్రదేశాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని సూచిస్తున్నాయి.

ఈరోజు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకొని తీవ్ర అల్పపీడనంగా మారుతుందని తెలిపింది. ఈశాన్య దిశగా కొనసాగి రేపటికి ఒడిశా తీరానికి అనుకొని వాయువ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో తీరం వెంట బలమైన గాలులు వీయడంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇది కూడా చదవండి..

కస్టమర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఎస్‌బీఐ..!

రానున్న 24 గంటల్లో రాయలసీమలోని కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు యానాంలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదనంగా, మంగళవారం, కొన్ని చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా, ఒకటి లేదా రెండు నిర్దిష్ట ప్రాంతాల్లో భారీ వర్షపాతం సంభవించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి.. 

కస్టమర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ఎస్‌బీఐ..!

Share your comments

Subscribe Magazine