News

AP: రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మరికాసేపట్లో రైతు ఖాతాల్లో డబ్బులు..!

Srikanth B
Srikanth B

రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ పరభుత్వం అందిస్తున్న పథకాలలో పంట భీమా ఒకటి 2021 గాను భారీ వర్షం మరియు వరదల ద్వారా పంట నష్టపోయిన రైతులకు నేడు రాష్ట్ర ప్రభుత్వం పంట భీమా ద్వారా ఆర్థిక సాయాన్ని అందించనున్నది , దీనికి సంబంధించి లబ్దిదారులనును ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 15,60,763 మంది రైతులను లబ్ది దారులు గ గుర్తించింది .

ఈ  సహాయం ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివిధ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ,అయితే ఈ మొత్తాన్ని DBT (డైరెక్ట్ బినిఫిట్ ట్రాన్స్ఫర్) ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి జమచేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సంబంధిత సొమ్మును లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కాగా, ఈ కార్యక్రమానికి శ్రీసత్య సాయి జిల్లా వేదిక కానుంది. నేడు సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్..

ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా, ఈ పథకం కింద.. రాష్ట్రవ్యాప్తంగా 15,60,763 మంది రైతులకు రూ. 2,977 కోట్ల రూపాయల పంట బీమాను అందిస్తోంది సర్కార్‌.

MSP చట్టం తీసుకురాకుంటే రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతారు- మేఘాలయ గవర్నర్

Share your comments

Subscribe Magazine