News

సోమవారం నుంచి ఆంద్రప్రదేశ్ లో ఒక్క పూట బడులు !

Srikanth B
Srikanth B

ఏప్రిల్ 4వ తేదీ నుంచి పాఠశాల సమయాన్ని ఒక్క పూట కు పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా మండుతున్న ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నా

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ. రాష్ట్ర వ్యాప్తంగా   ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగింది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు  ఒక్క పూట బడులు నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు .

 ప్రతిరోజూ ఉదయం 7.30 గంటలకు క్లాసు పనులు ప్రారంభమై 11.30 గంటలకు ముగుస్తాయని మంత్రి తెలిపారు.

ఎస్.ఎస్.సి. మరియు ఇంటర్మీడియట్ పరీక్షలు  మొదలుకానున్నాయి . ఎస్ఎస్సీ పరీక్షలు ఏప్రిల్ 27న, ఇంటర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి వాటికీ సంబందించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు అయన వెల్లడించారు .

ఒక్క పుట  పాఠశాలలను నడపాలని ప్రభుత్వాన్ని కోరిన బాలల హక్కుల పరిరక్షణ ఫోరం మరియు విద్యార్థి సంఘాలు ఈ నిర్ణయంపై సంతృప్తి వ్యక్తం చేశాయి.

CUCET 2022: సెంట్రల్ యూనివర్సిటీల కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ లో ప్రారంభం!

Related Topics

school half day Andhra Pradesh

Share your comments

Subscribe Magazine