News

వాలంటీర్లకు ఏపీ సీఎం శుభవార్త.. త్వరలోనే రెట్టింపు కానున్న జీతాలు..

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ వాలంటీర్ వ్యవస్థను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను మరియు కార్యక్రమాలను ఈ వాలంటీర్ల ద్వారానే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తుంది. ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఏ పథకం లబ్ది పొందాలన్న ఈ వాలంటీర్ల వల్లే సాధ్య పడుతుంది.

ఒక విధంగా, వారు ప్రభుత్వ సేవలను నేరుగా ప్రజల ఇళ్లకు అందించి, ప్రజలు మరియు పాలక అధికారుల మధ్య వారధిగా పనిచేస్తారు. ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే ఎదురులేని వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. వాలంటీర్లు ప్రయోజనకరమైన కార్యక్రమాలను అమలు చేయడం నుండి రేషన్ వస్తువులను పంపిణీ చేయడం మరియు అనేక ఇతర సేవా-ఆధారిత కార్యకలాపాలను నిర్వహించడం వరకు అనేక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.

గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు, పట్టణాల్లో అయితే 100 ఇళ్లకు ఒకరు చొప్పున వాలెంటీర్లు పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దాదాపు మూడు లక్షల మంది ఉన్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వాలంటీర్లకు శుభవార్త అందించనున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..

రైన్ అలెర్ట్ ! రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ కేంద్ర హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఈ వలంటీర్ల జీతాలను పెంచనున్నారంట. వీరి జీతాలను రెట్టింపు చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రస్తుతం ప్రభుత్వం వాంలంటీర్లకు రూ.5 వేలను జీతంగా అందిస్తుంది. అయితే ఈ రూ.5 వేలను రెట్టింపు చేసి రూ.10వేలకు పెంచి వాలంటీర్లకు జీతంగా ఇవ్వనుందని తెలుస్తోంది.

జగన్ పుట్టినరోజు అయిన డిసెంబర్ 21న ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. జనవరి 1 నుంచి వేతనాల పెంపుదల అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పవన్, చంద్రబాబు తనపై చేస్తున్న ఆరోపణలపై చురుగ్గా ప్రసంగిస్తున్నట్లు వాలంటీర్లకు చాటిచెప్పేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి..

రైన్ అలెర్ట్ ! రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు.. వాతావరణ కేంద్ర హెచ్చరిక

Share your comments

Subscribe Magazine