News

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు.

KJ Staff
KJ Staff
Andhra Pradesh In 144 Section
Andhra Pradesh In 144 Section

ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. ఆ తర్వాత కర్ఫ్యూ అమల్లోకి వస్తుంది.

కోవిడ్‌ కట్టడే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేటి నుంచి కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 5 (బుధవారం) నుంచి మే 18 వరకు రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. కర్ఫ్యూ సమయంలో అన్ని వ్యాపార సంస్థలు, దుకాణాలు, సంస్థలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు అన్నీ మూసివేయాల్సి ఉంటుంది.

ఏపీలో బుధవారం మధ్యాహ్నం నుంచి కర్ఫ్యూ అమల్లోకిరానుంది. 12 గంటల తర్వాత ఆంక్షలు మొదలుకానున్నాయి. రెండు వారాలు 18 గంటల పాటూ కర్ఫ్యూ కొనసాగుతుంది. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144వ సెక్షన్‌ విధిస్తారు. ఆ సమయంలో ఎక్కడా ఐదుగురికి మించి గుమిగూడి ఉండటానికి వీల్లేదు. వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, విద్యా సంస్థలు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసివేయాలి. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనల్ని, మార్గదర్శకాలను వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటికే ముహుర్తాలు నిర్ణయించుకుని, వాటిని వాయిదా వేసుకోలేని పరిస్టితుల్లో నిర్వహించే వివాహ వేడుకలకు 20 మందికి మించి హాజరవడానికి లేదని స్పష్టం చేశారు. అది కూడా స్టానిక అధికారుల నుంచి ముందస్తు అనుమతితో.. కొవిడ్‌ నిబంధనల్ని పాటిస్తూ నిర్వహించుకోవాలి. ప్రభుత్వం మినహాయింపునిచ్చిన అత్యవసర విభాగాలు, సేవల రంగాల్లో పనిచేస్తున్నవారు తప్ప మిగతా వ్యక్తులెవరు కర్ఫ్యూ సమయంలో బయట తిరగడానికి వీల్లేదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ.. వ్యవసాయశాఖ జారీ చేసే కొవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి నిర్వహించుకునేందుకు అనుమతిచ్చారు.

కర్ఫ్యూని తక్షణం అమలు చేసేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ విభాగాలు, పోలీసు కమిషనరు, జిల్లా కలెక్టర్లు ఆదేశాలు, నోటిఫికేషన్లు ఇస్తారు. మినహాయింపు ఇచ్చిన కేటగిరీలకు చెందిన వారికి పాస్‌లు జారీ చేస్తారు. నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51, 60 సెక్షన్సు ఐపీనీ సెక్షన్‌ 188తోపాటు దీనికి వర్తించే ఇతర చట్టాల్ని అనుసరించి ప్రాసిక్యూట్ చేస్తామని హెచ్చరించారు. కర్ఫ్యూలేని సమయంలో 144 సెక్షన్‌ని పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. సరకుల కొనుగోలుకి, వివిధ సేవలు పొందేందుకు భౌతికదూరం, కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ క్యూల్లో నిలబడ్డ వారికి అది వర్తించదు.

వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్లే గర్భిణిలు, రోగులకు అనుమతి ఉంది. ప్రభుత్వం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవడానికి వెళ్లేవారికి అనుమతి ఇస్తారు. ప్రభుత్వ, పైవేటు ఆరోగ్య సంస్థల్లో వైద్య సేవలు పొందుతున్నవారు.. ఆరోగ్య సేవలు పొందేందుకు పైవేటు వాహనాల్లో వెళ్లేందుకు అవకాశం ఉంది. విమ్రానాశ్రయాలు, రైల్వే స్టేషన్ బన్‌స్టాండకు వెళ్లేవారు.. అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు టిక్కెట్‌ చూపించాల్సి ఉంటుంది

వీరికి కూడా మినహాయింపు 

► కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, కోర్టులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థల్లో పనిచేసేవారు డ్యూటీ పాస్‌తో కర్ఫ్యూ సమయంలో తిరగొచ్చు.

 

► వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది, పారామెడికల్‌ సిబ్బంది (ప్రభుత్వ, ప్రైవేటు) గుర్తింపు కార్డుతో తిరగొచ్చు. 

 

► వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, గర్భిణులు, కోవిడ్‌ టీకాలకు వెళ్లే వ్యక్తులు 

 

► ఆరోగ్య సేవలు పొందడానికి వెళ్లే వ్యక్తులు ప్రైవేటు రవాణా సేవలు పొందడానికి అనుమతి

 

► రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి విధిగా టికెట్‌ ఉండాలి. అలాంటివారికి అక్కడకు వెళ్లడానికి స్థానిక అధికారులు రవాణా ఏర్పాటు చేయాలి. 

 

► అంతర్రాష్ట్ర, అంతర్‌ జిల్లాల ప్రజా రవాణాను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తారు.

 

► పెళ్లిళ్లు, ఫంక్షన్లకు కేవలం 20 మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇందుకు స్థానిక అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. 

Share your comments

Subscribe Magazine