News

రైతులకు రూ.2 వేలు.. మార్చిలో బ్యాంకు ఖాతాల్లో జమ

KJ Staff
KJ Staff

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 8వ విడత డబ్బులను మార్చిలో రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఈ నగదును రైతుల ఖాతాల్లో నేరుగా కేంద్ర ప్రభుత్వం జమ చేస్తోంది.

ఈ పథకానికి అర్హులై ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని రైతులు.. వెంటనే ఈ పథకానికి అప్లై చేసుకోండి. దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎమ్మార్వో ఆఫీసులోని పీఎం కిసాన్ సెంటర్ అధికారిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఆ వెబ్‌సైట్‌లో కనిపించే new farmer registration  మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్, పొలం పాస్‌బుక్, ఆధార్ కార్డు వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ వివరాలను అధికారులు తనిఖీ చేసి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. మీ అప్లికేషన్ స్టేటస్‌ను మీరు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చు.

Related Topics

central govt farrmers

Share your comments

Subscribe Magazine