News

రైతులకు ఊరట.. ఎరువుల ధరల పెంపు లేనట్లే

KJ Staff
KJ Staff

ఎరువుల ధరలను పెంచవద్దని ఎరువుల తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. బంగారం , వెండి.. పెట్రోల్, డీజిల్ ధరలు లాగే అంతర్జాతీయ మార్కెట్‌ను బట్టి ఎరువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. అంతర్జాతీయంగా ముడి సరుకు ధరలు పెరగడంతో.. దేశంలో ఎరువుల ధరలను పెంచుతున్నట్లు ఇటీవల ఎరువుల కంపెనీలు ప్రకటించాయి.

పలు కంపెనీలు దాదాపు 50 శాతం వరకు ధరలు పెంచుతున్నట్లు  ప్రకటించగా.. మరికొన్ని కంపెనీలు త్వరలో పెంచుతున్నట్లు ప్రకటించాయి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులపై ఒక్కో బస్తాపై కనీసం రూ.450 పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి. ఇక డీఏపీ ధర అంతకుమందు రూ.1200 ఉండగా.. రూ.700 పెంచాయి. దీంతో డీఏపీ బస్తా ధర రూ.1900కి చేరుకుంది.

ఇక కాంప్లెక్స్ ఎరువుల ధరలు రూ.450 పెంచగా.. యూరియా ధర కేంద్రం చేతుల్లో ఉండటంతో ధరలు పెంచడం సాధ్యం కాలేదు. డీఏపీ, కాంప్లెక్స్ ధరలు భారీగా పెంచడంతో.. రైతులు ఆందోళనకు గురయ్యారు. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు తయారీ ఉపయోగించే పాస్పారిక్, అమ్మోనియాను చైనా, అరేబియా దేశాల నుంచి భారత్ దిగుమతి చేసుకుంటుంది. అక్కడ వీటి ధరలు భారీగా పెరగడంతో.. దేశీయంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీలు ప్రకటించాయి.

పెంచిన ధరలు ఈ నెల నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దీంతో రైతులపై పెట్టుబడి భారం మరింత పెరిగే అవకాశముంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను పెంచవద్దని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. యూరియా మినహా ఇతర ధరలను పెంచవద్దని తెలిపింది. డీఏపీ, ఎంవోసీ, ఎన్‌పీకేలకు ఉన్న ధరలను కొనసాగించాలని ఆదేశించింది.

ఇవాళ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. అనంతరం కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. ఎరువుల ధరలను పెంచవద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

Share your comments

Subscribe Magazine