News

తప్పుదోవ పట్టించే ప్రకటనలపై కేంద్రం తీవ్ర చర్యలు!

S Vinay
S Vinay

వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రకటనలను నియంత్రించడం కోసం వినియోగదారుల రక్షణ చట్టం చర్యలు తీసుకోనుంది.

వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడం మరియు దోపిడీకి గురయ్యే వినియోగదారులను రక్షించే లక్ష్యంతో 'తప్పుదోవ పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలని నోటిఫై చేసింది.వినియోగదారులకి అతిశయోక్తి వాగ్దానాలు, తప్పుడు సమాచారం మరియు తప్పుడు క్లెయిమ్‌లతో మోసపోకుండా ఉండేలా మార్గదర్శకాలను జారీ చేసింది.

వినియోగదారుల హక్కుల ఉల్లంఘన, మోసపూరిత వాణిజ్య పద్ధతులు మరియు ప్రజల మరియు వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే తప్పుడు లేదా తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన విషయాలను నియంత్రించడం కోసం వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 10 కింద CCPA స్థాపించబడింది.

చిన్నపిల్లల పై ప్రకటనలు తీవ్ర ప్రభావం చూపుతాయి, పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలపై అనేక ముందస్తు నిబంధనలు నిర్దేశించబడ్డాయి. పిల్లలను లక్ష్యంగా చేసుకునే ప్రకటనలు క్రీడలు, సంగీతం లేదా సినిమా రంగానికి చెందిన వ్యక్తులను ప్రదర్శించకూడదని మార్గదర్శకాలు చెబుతున్నాయి.

తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్, అడ్వర్టైజర్ మరియు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ విధులకు స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించబడ్డాయి,మార్గదర్శకాలను ఉల్లంఘించినందుకు జరిమానా కూడా స్పష్టంగా వివరించబడింది. CCPA ఏదైనా తప్పుదోవ పట్టించే ప్రకటనల కోసం తయారీదారులు, ప్రకటనదారులు మరియు ఎండార్సర్‌లపై 10 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. పునరావృతం అయితే CCPA 50 లక్షల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు.తప్పుదారి పట్టించే ప్రకటనను ఆమోదించేవారిని 1 సంవత్సరం వరకు ఎటువంటి ఎండార్స్‌మెంట్ చేయకుండా నిషేధించవచ్చు మరియు తదుపరి ఉల్లంఘన కోసం, నిషేధాన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

మరిన్ని చదవండి.

కొత్త నాణాలు విడుదల చేసిన ప్రధాని...వీటి ప్రత్యేకత ఏంటి?

Share your comments

Subscribe Magazine