News

సింహాన్ని పోలి ఉన్న దూడకు జన్మనిచ్చిన ఆవు! మరో వింత?

KJ Staff
KJ Staff

బ్రహ్మం గారి కాలజ్ఞానం లో చెప్పిన వింత సంఘటనలకు మల్లె మరో విపరీత సంఘటన చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ లో ఒక ఆవు సింహం పిల్లను పోలి ఉన్న దూడను ప్రసవించిన వార్త చాలా గందరగోళానికి దారితీసింది, ఈ అసాధారణ సంఘటనను చూసేందుకు ఆ ఉరి ప్రజలు తరలివచ్చారు.

ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లాలో గల గోర్ఖా గ్రామంలో చోటుచేసుకుంది. నాథులాల్ శిల్పాకర్ అనే రైతు యొక్క ఆవు సింహం పిల్లను పోలిన దూడకు జన్మనిచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటన చాల వేగంగా గ్రామం అంతటా వ్యాపించింది, దీనితో రైతు ఇంటి వద్ద ఆసక్తిగా చూపరులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.

తాజాగా చోటుచేసుకున్న ఈ విస్మయకర సంఘటనతో డాక్టర్లు సైతం ఆశ్చర్యపోయారు. పశువైద్యాధికారి ఎన్‌కె తివారీ, ఇది ప్రకృతిలో జరిగిన అద్భుత సంఘటన కాదని, పిండం సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల తలెత్తిన సమస్య అని సూచించారు. తివారీ ప్రకారం, ఆవు కడుపులో లోపం కారణంగా దూడ ఇలా సిమ్హం పోలికలు ఉన్నట్టుగా జన్మించింది.ఆవు గర్భాశయంలో ఏర్పడిన లోపం వల్లే ఈ ఘటన జరిగిందని పశుసంవర్ధక శాఖ నిర్ధారించింది.

ఇది కూడా చదవండి..

అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..

నివేదికల ప్రకారం, దూడ జన్మించిన తర్వాత ఆరోగ్యంగానే ఉంది, కానీ పాపం అరగంట తర్వాత మరణించింది. చనిపోయిన సింహాన్ని పోలి ఉన్న దూడ యొక్క అసాధారణ రూపం, దృశ్యాన్ని చూసేందుకు గూర్ఖా గ్రామంలోని నలుమూలల నుండి సందర్శకులు ప్రయాణించి వస్తున్నారు.

ఇది కూడా చదవండి..

అక్షరాలా కోట్ల రూపాయలు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప..

Share your comments

Subscribe Magazine