News

హైదరాబాద్ లో కొనసాగనున్న పొడి వాతావరణం .. శనివారం నాటికీ వర్షం కురిసే అవకాశం !

Srikanth B
Srikanth B

బుధవారం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 38.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం వరకు మధ్యాహ్నం లేదా సాయంత్రం వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ తన సూచనలో పేర్కొంది, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రణాళిక సంఘం (TSDPS) రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరం కొనసాగే అవకాశం అంచనా వేసింది. రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది .

మరో రెండు రోజుల్లో నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదు కావచ్చని , రాష్ట్రవ్యాప్తంగా 39 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని బుధవారం తెలంగాణ వాతాహవారణ ఆశాఖ వెల్లడించింది . బుధవారం  ఆదిలాబాద్‌లో అత్యధికంగా 43.4 డిగ్రీల సెల్సియస్‌, నిజామాబాద్‌లో 42.7, కామారెడ్డిలో 41.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదయ్యాయి.

గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో అడ్డగుట్టలో అత్యధికంగా 38.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది అని తెలంగాణ వాతాహవారణ శాఖ వెల్లడించింది .

భారీగా పతనం అయినా టమాటా ధరలు .. పంటను రోడ్లపై పారబోస్తున్న తెలంగాణ రైతులు !

Share your comments

Subscribe Magazine