News

సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి: సతీష్ రెడ్డి

Srikanth B
Srikanth B

అనుమతుల విషయంలో వ్యాపార ఏర్పాటులో ఎదురవుతున్న సవాళ్లను కంపెనీల ప్రతినిధులు సతీష్ రెడ్డికి వివరించారు. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందించాలని కోరారు.

హైదరాబాద్: రాష్ట్రంలో సౌరశక్తి సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ చైర్మన్ వై.సతీష్ రెడ్డి తెలిపారు.

కంపెనీల విజ్ఞప్తులపై సతీష్ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రంలో సోలార్ పవర్ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, టీఎస్‌ఆర్‌ఈడీకో అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు.

సవాళ్లను అధిగమించి ప్రక్రియను సజావుగా సాగించేందుకు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, రానున్న రోజుల్లో సోలార్‌ విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతుందని, సరఫరాకు అనుగుణంగా కంపెనీలు సిద్ధంగా ఉండాలని కోరారు.

డొమెస్టిక్ సన్ రూఫ్ టాప్ స్టాండ్‌లను ఉపయోగించడంపై అవగాహన సమావేశం యొక్క ముఖ్య ఎజెండాలో ఒకటిగా మరియు రాష్ట్రంలో రూఫ్ టాప్ సోలార్ వినియోగాన్ని పెంచడానికి వివిధ చర్యలపై చర్చించామని ఆయన చెప్పారు.

మహారాష్ట్ర: లంపీ వైరస్ బారిన పడి 25 జిల్లాల్లో 126 పశువులు మృతి !

Share your comments

Subscribe Magazine