News

పాత 500, 1000 నోట్లు మార్చుకొని వారికోసం పరిష్కార మార్గాన్ని చుడండి - సుప్రీం కోర్టు

Srikanth B
Srikanth B

 

భారతీయ ప్రధాని నరేద్రమోడీ 2016 సంవత్సరంలో ఆకస్మికంగా పెద్ద నోట్ల రద్దు చేసిన విషయం అందరికి తెలిసిందే , పెద్ద నోట్లు 500,1000 రూపాయల నోట్లు నల్లధనం పెరగడానికి కారణంగా చూపుతూ ఈ కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రద్దు అయినా పెద్ద నోట్లని విడతలవారీగా బ్యాంకు ఖాతాల ద్వారా మార్చుకోవాలని ప్రజలను సూచించింది .

అయితే కొంతమంది తెలియక, అనేక కారణాలతో మార్చుకోవడానికి వీలుపడలేదు . అలాంటివారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక పిటిషన్లను దాఖలు చేసారు ప్రస్తుతం దీనిపై సుప్రీం కోర్టు విచారం చేపట్టింది . విచారణలో భాగం గ RBI కి సుప్రీమ్ కోర్టు కీలక సూచనలను చేసింది . వివిధ కారణాలతో నోట్ల రద్దు సమయం లో నోట్లు మార్చుకొని వారికోసం RBI పరిష్కారమార్గాన్ని చూపాలని సూచనలను చేసింది . కొన్ని ప్రత్యేకమైన కారణాలతో నోట్లను మార్చుకొని వారికీ ఇప్పుడు వెసులుబాటు కల్పించేందుకు ఏదైనా అవకాశం ఉందా అని రిజర్వు బ్యాంకును సుప్రీం కోర్టు కోరింది. కోమాలో ఉన్న ఒకమహిళా డబ్బు మార్చుకోలేదని దీనికి ఉదాహరణగా చూపింది . నిజాయితీగా, సరైన కారణాలతో అప్పట్లో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని అన్వేషిచాలని RBI ను సుప్రీమ్ కోర్టు సూచించింది .

మేకలకు రెయిన్ కోట్ వేసిన రైతు..సోషల్ మీడియాలో వైరల్..!

ప్రభుత్వ న్యాయవాది అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి దీనికి బదులిస్తూ.. నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే రిజర్వు బ్యాంక్ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు.స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టంలోని చట్టాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ధేశించిన గ్రేస్ పిరియడ్ లోపు రద్దైన నోట్లను జమచేయలేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. తమ వద్ద ఇప్పటికి పాత 500,1000 నోట్లు ఉంటె భద్ర పరుచుకోవాలని సూచిస్తూ తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా పడింది .

మేకలకు రెయిన్ కోట్ వేసిన రైతు..సోషల్ మీడియాలో వైరల్..!

Share your comments

Subscribe Magazine