News

అకాల వర్షాల వళ్ళ తీవ్రంగా నష్టపోయిన అన్నదాత!

S Vinay
S Vinay

తెలంగాణాలో వివిధ ప్రాంతాల్లో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన వరి పంటలకి అపార నష్టం వాటిల్లింది.

కొన్ని కొనుగోలు కేంద్రాల్లో వరి నిల్వలు కొట్టుకుపోగా, మరికొన్ని కేంద్రాల్లో తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి సేకరణ మందగించడం, వర్షాలు కురిస్తే వరి నిల్వలను కాపాడేందుకు సరిపడా టార్పాలిన్లు లేకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారు. భారీ వర్షాల కారణంగా మూసాంబి, నిమ్మ తదితర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి.

భారీగా కురిసిన ఈ వర్షం లో కప్పడానికి టార్పాలిన్లు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వర్షానికి చాలాచోట్ల పెద్ద ఎత్తున ధాన్యం కొట్టుకుపోయింది.

జిల్లాలను తాకిన భారీ ఈదురుగాలులతో కూడిన ఆకస్మిక వర్షం కారణంగా వరితో పాటు, కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక షెడ్లు కూడా దెబ్బతిన్నాయి.

రబీ సీజన్‌లో 65 లక్షల టన్నుల వరి ధాన్యాన్ని గ్రామ స్థాయిలో 6,920 కేంద్రాలను ఏర్పాటు చేసి ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నప్పటికీ, పౌరసరఫరాల శాఖ ఇప్పటి వరకు 3,525 కేంద్రాలను మాత్రమే ఏర్పాటు చేసి కేవలం 4.21 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసింది.

దీంతో గత నెల రోజులుగా వేల కొనుగోలు కేంద్రాల్లో లక్షల టన్నుల వరి ధాన్యం పడి ఉంది. రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే సరిపడా టార్పాలిన్లు సరఫరా చేసి కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయకుంటే మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం పజ్జూరులో 98 మిల్లీమీటర్ల వర్షపాతంతో రాష్ట్రంలో రెండో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షానికి హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

మరిన్ని చదవండి.

వ్యవసాయం లో డ్రోనుల కొనుగోలుకై రైతులకు 5 లక్షల వరకు సబ్సిడీ:కేంద్ర వ్యవసాయ మంత్రి

Share your comments

Subscribe Magazine