News

ఆగస్టు 1 నుంచి గ్యాస్ పై రూ. 100 తగ్గింపు ...

Srikanth B
Srikanth B
ఆగస్టు 1 నుంచి గ్యాస్ పై రూ. 100 తగ్గింపు ...
ఆగస్టు 1 నుంచి గ్యాస్ పై రూ. 100 తగ్గింపు ...

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న ప్రజలకు చమురు కంపెనీ లు శుభవార్త అందించాయి . ఆగస్టు రోజునే గ్యాస్ 1 వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను అందించాయి. ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను చమురు భారీగా తగ్గించాయి దీనితో చిరు వ్యాపారులకు కాస్త ఊరట లభించనుంది . చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1 ఉదయం వాణిజ్య సిలిండర్ల ధరను రూ.100 తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌కు గతంలో రూ.1780 చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు రూ.1680 చెల్లించాల్సి ఉంటుంది. దీనికి గతంలో రూ.1780 చెల్లించాల్సి వచ్చేది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.

దేశీయ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. ఇందుకోసం రాజధాని ఢిల్లీలో మునుపటిలా రూ.1103 చెల్లించాల్సి ఉంటుంది. ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.1780 నుంచి రూ.1680కి తగ్గింది. కోల్‌కతాలో గతంలో రూ.1895.50 ఉండగా, ఇప్పుడు రూ.1802.50 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ముంబైలో గతంలో రూ.1733.50కి లభించగా, ఇప్పుడు రూ.1640.50కి అందుబాటులోకి రానుంది. చెన్నైలో ధర రూ.1945.00 నుంచి రూ.1852.50కి తగ్గింది.

భారత ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!

27 రోజుల తర్వాత వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు తగ్గించాయి. అంతకుముందు జూలై 4న కంపెనీలు సిలిండర్‌పై రూ.7 చొప్పున పెంచాయి. జులైకి ముందు మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సిలిండర్ల ధరలు తగ్గాయి. మార్చి 1, 2023న.. సిలిండర్ ధర రూ.2119.50. ఆ తర్వాత ఏప్రిల్‌లో రూ.2028కి తగ్గగా, మేలో రూ.1856.50కి, జూన్ 1న రూ.1773కి చేరింది. అయితే దీని తర్వాత జూలైలో రూ.7 పెరగడంతో ఢిల్లీలో సిలిండర్ రూ.1780కి చేరింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. 14.2 కేజీల సిలిండర్ ధరలు.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో సిలిండర్ ధర దాదాపు రూ. 1155 వద్ద ఉంది. అలాగే ఏపీలో సిలిండర్ ధర దాదాపు ఇదే స్థాయిలో రూ. 1161 వద్ద కొనసాగుతోంది.

భారత ప్రభుత్వం రైతులకు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి!

Related Topics

gas cylinder

Share your comments

Subscribe Magazine