News

రైతులకు శుభవార్త.. రైతులకు మరో 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌.. ముఖ్యమంత్రి జగన్..!

Gokavarapu siva
Gokavarapu siva

మంగళవారం సీఎం జగన్ పలు ఇంధన సంబంధిత ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇంధన రంగానికి సంబంధించి రూ.6600 కోట్ల విలువైన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, పనులకు సీఎం జగన్ మంగళవారం వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి కడప, అనంతపురంలో 750 మెగావాట్లు, 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ పవర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.

వీటితో పాటు 16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్ స్టేషన్లు వర్చువల్‌గా ప్రారంభించారు. పునరుత్పాదక విద్యుత్ రంగంలో హెచ్పీసీఎల్ తో రూ.10 వేల కోట్ల విలువైన ప్రాజెక్టుపై సీఎం జగన్ సమక్షంలో అవగాహనా ఒప్పందం జరిగింది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్‌ అందేలా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. ప్రారంభించిన సబ్‌స్టేషన్లతో స్థానికులు కష్టాలు తీరనున్నాయన్నారు.

వైసీపీ అధికారంలోకి రాగానే రైతులకు 9 గంటల విద్యుత్‌ పగటి పూటే ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 28 సబ్‌ స్టేషన్లకు శ్రీకారం చుట్టామన్నారు. 14 జిల్లాల్లో విద్యుత్‌ సరఫరా వ్యవస్థ బలోపేతం చేసుకున్నామన్నారు. గోదావరి ముంపు ప్రాంతాలైన చింతూరు, వీఆర్‌పురం, ఎటపాకలో సబ్‌స్టేషన్లను ఇవాళ ప్రారంభించామన్నారు. ప్రతీ గ్రామానికి నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలోని రేషన్‌కార్డు హోల్డర్లకు ప్రభుత్వం శుభవార్త.. డిసెంబర్ నుంచి..

రూ.1700 కోట్లతో ఫీడర్‌లను ఏర్పాటు చేయడం ద్వారా రైతాంగానికి నాణ్యమైన విద్యుత్‌ను అందించడానికి వారు ప్రశంసనీయమైన చొరవను చేపట్టారని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇచ్చేందుకు సెకీతో ఒప్పందం చేసుకున్నామన్నారు. మరో 25 ఏళ్ల పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తామన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 28 సబ్‌స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, దీని కోసం రూ. 3099 కోట్లు కేటాయించినట్లు సీఎం జగన్ తెలిపారు. వీటిలో కొన్ని సబ్‌స్టేషన్లు ఈరోజు నిర్మాణాన్ని ప్రారంభించగా, మరికొన్ని త్వరలో ప్రారంభం కానున్నాయి. దీంతో పాటు రూ. 3400 కోట్లతో 850 మెగావాట్ల సోలార్‌ పవర్‌కు శ్రీకారం చుడుతున్నామన్నారు. అవేరా స్కూటర్స్ సంస్థ రూ. 6500 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు.

తాజాగా ప్రారంభించిన సబ్‌ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగాలు వస్తున్నాయన్నారు. 850 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు వల్ల మరో 1700 ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. హెచ్‌పీసీఎల్‌ సంస్థతో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు.

ఇది కూడా చదవండి..

రాష్ట్రంలోని రేషన్‌కార్డు హోల్డర్లకు ప్రభుత్వం శుభవార్త.. డిసెంబర్ నుంచి..

Share your comments

Subscribe Magazine