News

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. త్వరలో అందుబాటులోకి 'ఆహ' క్యాంటిన్లు..

Gokavarapu siva
Gokavarapu siva

జగన్ సర్కార్ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో మేలు చేసే కీలక నిర్ణయం తెలియజేసింది. గత టీడీపీ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ల తొలగింపుపై వచ్చిన విమర్శలకు సమాధానంగా రాష్ట్రవ్యాప్తంగా ఆహా క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.

సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించడానికి, ఈ క్యాంటీన్లు మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అప్పగించనున్నారు.ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్‌ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో 'ఆహా' క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది.

ఇది కూడా చదవండి..

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలెర్ట్..

రాష్ట్రవ్యాప్తంగా ఈ క్యాంటిన్లను అందబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ 'ఆహా' క్యాంటీన్ల ఏర్పాటు యొక్క అంతిమ లక్ష్యం సమాఖ్యలో సభ్యులుగా ఉన్న ఇంకా ఎక్కువ మంది పట్టణ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించడం. ఫలితంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఆహా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఈ క్యాంటిన్లకు ఇప్పటికే ప్రజల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని తెలుపుతున్నారు.

ఇది కూడా చదవండి..

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఆరెంజ్ మరియు రెడ్ అలెర్ట్..

Share your comments

Subscribe Magazine