News

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం..!

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ జగన్ ప్రజలకు ఎన్నో ప్రయోజనకరమైన పథకాలను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాలను నెరవేర్చేవిధంగా, ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ప్రస్తుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు.

ఈ పథకాలు ముఖ్యంగా కార్మికులు మరియు మహిళలను ఉద్దేశించి, వారికి ఆర్ధిక అవసరాలను తీర్చడానికి సహాయపడుతున్నాయి.ఒక్కో వర్గానికి ఒక్కో స్కీమ్ చొప్పున ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది జగన్ ప్రభుత్వం. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాల నుండి చాలా మంది ప్రజలు ఇప్పటికే లబ్ది పొందుతున్నారు. అలాంటి పథకాల్లో ఒకటి వాహన మిత్ర. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తుంది.

ఇటీవలి ఏపీ ప్రభుత్వం ఈ వాహనమిత్ర పథకం లబ్దిదారులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని జగన్ ప్రభుత్వం ఇటీవల ఆటో, టాక్సీ మరియు క్యాబ్ డ్రైవర్లకు కొన్ని సానుకూల వార్తలను అందించింది. వాహనమిత్ర పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ప్రకటించిన రూ.10,000 ఈ నెల 29వ తేదీన ఈ డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.

ఇది కూడా చదవండి..

ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 29న కాకినాడలో వైఎస్సార్‌ వాహనమిత్ర ఐదో విడత ఆర్థిక సాయం విడుదల రాష్ట్రస్థాయి కార్యక్రమంలో పాల్గొంటారు. కాకినాడలో బటన్ నొక్కి డ్రైవర్ల బ్యాంకు ఖాతాల్లో ఈ పథకం యొక్క నిధులను జమ చేయనున్నారు. దీని తరువాత సీఎం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు కలెక్టర్‌ కృతికా శుక్లా తెలిపారు. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ నాగ నరసింహారావు, పలువురు అధికారులతో కలిసి సభా ప్రాంగణాన్ని మరియు హెలిప్యాడ్‌ ఏర్పాట్లను పరిశీలించారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ఈ కార్యక్రమంలో లబ్ధిదారులుగా మారిన వ్యక్తులకు వార్షికంగా రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ నగదు నేరుగా లబ్ధిదారుని బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. వాహన నిర్వహణ, ఫిట్‌నెస్ సర్టిఫికేట్‌లు పొందడం మరియు బీమా పొందడం వంటి వివిధ ఖర్చులను కవర్ చేసేలా చూసుకుంటూ, ప్రతి సంవత్సరం ఈ ఆర్థిక సహాయాన్ని అందించే బాధ్యతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటుంది.

ఇది కూడా చదవండి..

ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి..

Share your comments

Subscribe Magazine