News

రైతులకు కేసీఆర్ శుభవార్త .

KJ Staff
KJ Staff
Cm K.C.R
Cm K.C.R

తెలంగాణ రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

రైతు బంధు, రైతు వేదిక అంటూ అనేక కార్యక్రమాలు చేపట్టింది. తాజాగా రైతులకు సంబంధించి మరో శుభవార్త చెప్పారు మంత్రి హరీశ్ రావు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై సిద్దిపేట కలెక్టరేట్ నుంచి మంత్రి హరీష్ రావు అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రైతులకు ఓ శుభవార్త చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైతులకు డబ్బులు చెల్లించేందుకు సీఎం కేసీఆర్ రూ. 26 వేల కోట్లు సిద్ధంగా ఉంచారని హరీశ్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బు జమ అవుతుందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.దీనికి సంబంధించి పలు విషయాలు తెలిపారు.

రైతులు మిల్లులో ధాన్యం దించిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి కావాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ పూర్తి కాగానే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. టార్ఫలీన్, గన్ని బ్యాగుల కొరత, ట్రాన్స్‌పోర్టు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారుల్ని హరీశ్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు, చెల్లింపుల్లో ఆలస్యం జరిగితే కొనుగోలు కేంద్రం ఇంచార్జీ అధికారిదే బాధ్యత అని హరీష్ రావు పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం పట్ల తెలంగాణ అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Share your comments

Subscribe Magazine