News

PM KISAN :జాబితాలో మీ పేరు ను ఇలా చెక్ చేయండి !

Srikanth B
Srikanth B
PM KISAN
PM KISAN

మీరు PM కిసాన్ యోజన యొక్క లబ్దిదారు అయితే మరియు మీ తదుపరి విడత డబ్బులు ఎటువంటి సమస్య లేకుండా కావాలనుకుంటే, వీలైనంత త్వరగా మీ eKYCని పూర్తి చేయండి. మీడియా నివేదికల ప్రకారం, రైతు లబ్ధిదారులందరూ 31 మార్చి 2022 లోపు eKYCని పూర్తి చేయాలని కోరారు, తద్వారా 11 వాయిదాలను వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమచేయ బడుతుంది.

eKYC వివరాలు పూర్తి కాకపోతే, ప్రభుత్వం PM కిసాన్ యోజన ద్వారా లభించే 2000/ రూపాయలు  మీరు పొందాక పోవచ్చు ,. కొన్ని నెలల క్రితం ప్రభుత్వం రైతులందరికీ eKYCని తప్పనిసరి చేసింది, కానీ కొన్ని కారణాల వల్ల పనులు నిలిపివేయబడ్డాయి. ఇప్పుడు eKYC లింక్ అధికారిక వెబ్‌సైట్‌లో యాక్టివేట్ చేయబడింది, తద్వారా రైతులు తమ వివరాలను పూర్తి చేయవచ్చు. 

పీఎం కిసాన్ స్కీమ్ కోసం eKYC ఎందుకు తప్పనిసరి

గత సంవత్సరం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న రైతులందరికీ eKYCని మోడీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది . మోసాలు/స్కామ్‌లు మరియు అనర్హులు ఈ పథకం ప్రయోజనం పొందకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకోబడింది. ఇప్పటికే ఉన్న/పాత మరియు కొత్త రైతులు ఎటువంటి ఆలస్యం లేకుండా eKYCని పూరించాలి.  

పిఎం కిసాన్ కొత్త జాబితాను ఎలా చెక్ చేయాలి!

దశ 1 - అధికారిక ప్రభుత్వ వెబ్ సైట్ కు వెళ్లండి

స్టెప్ 2 - హోమ్ పేజీలో 'ఫార్మర్స్ కార్నర్' కొరకు చూడండి మరియు 'లబ్ధిదారుడి జాబితా' అని ఉండే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

దశ 3 - మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ మరియు గ్రామ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయండి.

దశ 4 - అన్ని వివరాలను నింపిన తరువాత, 'గెట్ రిపోర్ట్' మీద క్లిక్ చేయండి మరియు మీరు పూర్తి జాబితాను పొందుతారు.

పెరిగిన దాణా ఖర్చులులతో ... భారంగా మారుతున్న "కోళ్ల" పెంపకం ! (krishijagran.com)

PM KISAN UPDATE :PM కిసాన్ యోజన డబ్బులు పొందడానికి మార్చి 31 లోపు eKYC పూర్తి చేయండి (krishijagran.com)

Share your comments

Subscribe Magazine