News

పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయి.. మీకు రాలేదా?. ఇలా ఫిర్యాదు చేయండి

KJ Staff
KJ Staff

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంకి సంబంధించిన నగదును లబ్ధిదారులైన రైతుల బ్యాంకు అకౌంట్లలో తాజాగా జమ చేసింది. రూ. 2 వేలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఇప్పటికే రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ అవ్వగా.. పీఎం కిసాన్ నగదు క్రెడిట్ అయినట్లు రైతులకు మెసేజ్ రూపంలో బ్యాంకులు సమాచారం ఇస్తున్నాయి.

ఏప్రిల్ 1 నుంచి ఈ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతున్నాయి. అటు, ఇటుగా వారం రోజుల్లో రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ అవుతాయి. ఈ విడతలో భాగంగా దాదాపు రూ.11.66 కోట్లును ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉంటే.. మీకు కొంచెం ఆలస్యమైనా డబ్బులు వస్తాయి.

లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందా?.. లేదా? అనేది తెలుసుకోండిలా..

-పీఎం కిసాన్ యోజన అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
-ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్‌ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత Beneficiary Status పై క్లిక్ చేయాలి
-ఇప్పుడు మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామం పేర్లను సెలక్ట్ చేసుకోవాలి.
-ఇక గెట్ రిపోర్ట్‌పై క్లిక్ చేసి మీ పేరు ఉందో లేదో చూసుకోండి

లబ్ధిదారుల జాబితాలో మీరు పేరు ఉన్నా డబ్బులు రాలేదా?.. ఇలా ఫిర్యాదు చేయండి

-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయండి
-contact us ట్యాబ్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత క్రింద help desk అనే బటన్ మీద క్లిక్ చేయండి.
-ఆ తర్వాత మీ ఫిర్యాదును నమెదు చేసి ఎంటర్ ప్లెస్ చేయండి

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి ఏడాదికి రూ.6 వేలను రైతుల బ్యాంక్ అకౌంట్లలో నేరుగా జమ చేసింది. ఏడాదికి మూడు విడతలుగా ఈ డబ్బులు జమ అవుతాయి. పీఎం కిసాన్‌కి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దరఖాస్తు చేసుకోనివారు చేసుకుంటే తర్వాతి విడతలో డబ్బులు జమ అవుతాయి.

Share your comments

Subscribe Magazine