News

రైతులు అలర్ట్: పీఎం కిసాన్ డబ్బులు రాలేదా.. అయితే ఇలా ఫిర్యాదు చేయండి!

KJ Staff
KJ Staff

కేంద్ర ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ముందుకు తీసుకురావడం కోసం ప్రతి సంవత్సరం వారి ఖాతాలో ఆరువేల రూపాయలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం ద్వారా 8 విడుదల డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డాయి. తొమ్మిదవ విడత డబ్బులు ఆగస్టు 9న ప్రధానమంత్రి విడుదల చేశారు.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క రైతుల ఖాతాలో పీఎం కిసాన్ నిధి యోజన పథకం కింద రెండు వేల రూపాయలు జమ అయ్యాయి.

ఈ క్రమంలోనే కొంత మంది రైతులకు పీఎం కిసాన్ 9 వ విడత డబ్బులు ఇంతవరకు వారి ఖాతాలో జమకాలేదు. ఎవరికైతే రెండు వేల రూపాయలు జమ కాలేదు అలాంటి వారు ఏ మాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. పీఎం కిసాన్ డబ్బులు పడని వారు కేవలం ఈ విధంగా ఫిర్యాదు చేయడంతో రెండు వేల రూపాయలను పొందవచ్చు. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచి మీ ఖాతాకు డబ్బులు జమ చేయబడుతుంది. అయితే ఆ డబ్బులు మీ అకౌంట్లో జమ కావు.

ఈ విధంగా అకౌంట్ లో డబ్బులు జమ కాకపోవడానికి పలు కారణాలు ఉండవచ్చు. ఒకవేళ అ మీ ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ వంటివాటిలో ఏమైనా తప్పుగా ఉంటే ఈ విధంగా డబ్బులు మన అకౌంట్లో జమ కావు. ఈ విధమైనటువంటి సమస్య ఉండే వారు ముందుగా మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించి మీ సమస్యను వివరించాలి. ఒకవేళ అధికారులు మీ సమస్యకు ఎలాంటి స్పందన తెలియ చేయకపోతే ఈ క్రింది హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి మన అకౌంట్లో డబ్బులు జమ కాకపోవడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చు.నంబర్ 011 24300606 /011 23381092 కు కాల్ చేయవచ్చు. సోమవారం నుంచి శుక్రవారం PM కిసాన్ హెల్ప్ డెస్క్ pmkisan ict@gov.in మెయిల్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కనుక్కోవచ్చు.

Share your comments

Subscribe Magazine