News

10వ తరగతి పాస్ అయితే రూ.10వేలు.. పీహెచ్డీ పూర్తి చేస్తే రూ.5 లక్షలు.. రేవంత్‌ రెడ్డి

Gokavarapu siva
Gokavarapu siva

చేవెళ్ల సభలో ఎస్సీ, ఎస్టీ వర్గాలను చేరుస్తూ పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సోనియా ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే 12 కీలక అంశాలను రేవంత్ జాబితా చేశారు. ఈ చర్యల అమలుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం బలంగా ఉంది.

రేవంత్‌ రెడ్డి ప్రకటించిన ఎస్సీ,ఎస్టీ డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలు

➨ ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు పదో తరగతిని పూర్తి చేస్తే, వారికి రూ.10 వేలు
➨ ఇంటర్ పూర్తి చేస్తే, వారికి రూ. 15 వేలు
➨ డిగ్రీ పూర్తి చేస్తే, వారికి రూ. 25 వేలు
➨ ఈ వర్గంలో వారు పీజీ పూర్తి చేస్తే, వారికి రూ. లక్ష రూపాయలు

➨ ఈ వర్గంలో వారు పీహెచ్ డీ పూర్తి చేస్తే, వారికి రూ.5 లక్షలు
➨ విద్యార్థులు విదేశాల్లో చదువుకోవాలనుకుంటే వారికి ఆర్ధిక సహాయం
➨ మండలానికి ఒక ఎస్సీ, ఎస్టీ గురుకుల స్కూల్స్

ఇది కూడా చదవండి..

రైతుల నుండి అక్టోబర్ చివరిలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణ.. కనీస మద్దతు ధర ఎంతంటే?

➨ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులకు ఉచిత హాస్టల్స్
➨ ఎస్టీలకు ఇచ్చిన పోడు భూములకు సర్వహక్కులు
➨ ఎస్సీలకు అసైన్డ్ భూములకు పట్టాలు
➨ ఎస్సీ, ఎస్టీలకు అంబేద్కర్ అభయం హస్తం పథకం కింద వారికి రూ. 12 లక్షలు

➨ ప్రతి సంవత్సరం గిరిజన తండాలకు రూ. 15 లక్షలు
➨ ఎస్సీ, ఎస్టీలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు
➨ జనభా ప్రకారం ఎస్సీలకు 18, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు
➨ ఇందిరమ్మ పక్కా ఇండ్ల కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 6లక్షలు

ఇది కూడా చదవండి..

రైతుల నుండి అక్టోబర్ చివరిలో ఖరీఫ్‌ ధాన్యం సేకరణ.. కనీస మద్దతు ధర ఎంతంటే?

Related Topics

PCC chief Revanth Reddy,

Share your comments

Subscribe Magazine